Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్ ఆదేశాలు బేఖాతర్ : సుప్రీంలో తేలిన తర్వాత తుదినిర్ణయం!!

Webdunia
గురువారం, 23 జులై 2020 (16:13 IST)
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ తిరిగి బాధ్యతల స్వీకారంపై దాగుడు మూతలు, అనిశ్చితి కొనసాగుతున్నాయి. 'నిమ్మగడ్డ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తగిన చర్యలు తీసుకోండి' అని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. దీంతో.. నిమ్మగడ్డను తిరిగి నియమించాలని గవర్నర్‌ స్పష్టంచేశారనే అభిప్రాయం కలిగింది. కానీ, ప్రభుత్వం మాత్రం దాగుడు మూతలు ఆడుతోంది. దీనికి కారణం లేకపోలేదు. 
 
హైకోర్టు సూచన మేరకు గవర్నర్‌ను కలిసేందుకు వీలుగా ఈనెల 17వ తేదీనే నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సిద్ధమయ్యారు. అయితే... గవర్నర్‌ ఆయనకు 20వ తేదీన సమయం ఇచ్చారు. ఈలోపు... రాష్ట్రప్రభుత్వం చకచకా అడుగులు వేసింది. 
 
కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు శుక్రవారం (24న) విచారణ జరపనున్నట్లు సమాచారం. ఈలోగా ప్రభుత్వం ఆయన్ను నియమించకపోవచ్చని.. సుప్రీంకోర్టు స్పందించే తీరును బట్టి నిర్ణయం తీసుకోవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments