Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ ఎమ్మెల్యేకు బాలకృష్ణ ఫోన్, నేను ఎన్టీఆర్ అభిమానినే అన్న ఎమ్మెల్యే

Webdunia
గురువారం, 23 జులై 2020 (16:01 IST)
నెల్లూరు జిల్లా కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగించిన అంశం నిప్పు రాజేసిన సంగతి తెలిసిందే. దీన్ని సీరియస్‍గా తీసుకోవాలని నెల్లూరు నాయకులకు చంద్రబాబు సూచనలు కూడా చేశారు. పెద్దఎత్తున పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేసి 'చలో కావలి' అంటూ పిలుపు ఇవ్వాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు.
 
కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావాలనే విగ్రహాన్ని తొలగించారని దీనికి పోలీసులు కూడా సహకరించారని నెల్లూరు జిల్లా పార్టీ నేతలు చంద్రబాబుకు తెలియజేశారు. అయితే తాజాగా ఇదే అంశం గురించి ఎన్.టి.ఆర్ తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ , వైసీపీ పార్టీకి చెందిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కు ఫోన్ చేసి విగ్రహం తొలగించాల్సిన అవసరం ఏముందని ఆరా తీశారు.
 
అయితే ఎన్టీఆర్ విగ్రహం యొక్క వీపు భాగం ఆలయానికి ఎదురుగా ఉన్నందున స్థానికులు తొలగించడం జరిగిందని, వివాదస్పదం కాని స్థలంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని బాలకృష్ణకు హామీ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్. తాను కూడా చిన్ననాటి నుంచే ఎన్టీఆర్ అభిమానిని అని బాలకృష్ణకు తెలియజేయడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments