Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుణాచల్‌ ప్రదేశ్‌లో తొలి విమానాశ్రయం_ఆగస్టు 15 నుంచి ప్రారంభం

Webdunia
శుక్రవారం, 22 జులై 2022 (22:57 IST)
Arunachal Pradesh
అరుణాచల్‌ ప్రదేశ్‌‌ వైపే ప్రస్తుతం ప్రజలు కన్నేసి వుంచారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావొస్తున్నా ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క విమానాశ్రయం కూడా లేకపోవటం పెద్ద లోటుగా అనిపించేది.
 
అయితే ఆ సుదీర్ఘ ఎదురుచూపులకు వచ్చే ఆగస్టు 15వ తేదీతో తెరపడబోతోంది. సొంత ఎయిర్‌పోర్ట్‌ కోసం ఆ రాష్ట్రం ఇన్నాళ్లూ కన్న కల నిజం కానుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో తొలి విమానాశ్రయం ప్రారంభం కానుంది. 
 
ఆ విమానాశ్రయం పేరు.. హోలోంగి ఎయిర్‌పోర్ట్‌. అక్కడి నుంచి ఆగస్టు 15న విమానాల రాకపోకలు ఆరంభం కానున్నాయి. ఈ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌.. రాష్ట్ర రాజధాని ఇటానగర్‌కి 15 కిలో మీటర్ల సమీపంలోనే ఉండటం విశేషం.
 
అరుణాచల్‌ ప్రదేశ్‌ భౌగోళికంగా, ప్రకృతిపరంగా అందమైన రాష్ట్రం. పూదోటల స్వర్గం. మంచుతో కూడిన పర్వతాలు, సహజ లోయలు, తళుక్కున మెరిసే ప్రవాహాలు, బౌద్ధ సన్యాసులు పఠించే శ్లోకాలు, వైవిధ్య వృక్ష, జంతుజాలాలతో పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించే ప్రాంతం. 
 
ఇన్నాళ్లూ ఈ రాష్ట్రానికి టూరిస్టులు వెళ్లాలంటే రకరకాల మార్గాలను ఆశ్రయించాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం విమానాశ్రయం ఈ ప్రాంతానికి రావడంతో.. పర్యాటకులు పండగ చేసుకుంటారనే చెప్పాలి. ఇంకా పర్యాటకుల తాకిడి పెరగక తప్పదని టాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments