Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారతీయ దంపతుల వద్ద 45 పిస్టల్స్ స్వాధీనం

gunshoot
, గురువారం, 14 జులై 2022 (11:01 IST)
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భారతీయ దంపతులను సోదా చేయగా, వారి నుంచి ఏకంగా 45 పిస్టల్స్‌ను ఎయిర్ పోర్టు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో వారిద్దరినీ అరెస్టు చేశారు. ఈ దంపతులను జగ్జీత్ సింగ్, జస్వీందర్ కౌర్‌గా గుర్తించారు. 
 
పైగా, ఈ కేసును నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌ విచారిస్తుంది. ఎన్.ఎస్.జీ అధికారులు పరిశీలించి ఈ తుపాకులు నిజమైనవేనని తేల్చింది. అదేసమయంలో ఈ తుపాకులు పూర్తిగా పనిచేసే స్థితిలోనే ఉన్నాయని ఓ కస్టమ్స్ అధికారి తెలిపారు. తాము స్వాధీనం చేసుకున్న తుపాకీల విలువ రూ.22.5 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. 
 
మరోవైపు, అరెస్టు చేసిన దంపతులు వియత్నాంలోని హోచిమిన్ సిటీ నుంచి ఢిల్లీకి వచ్చారు. వీరివద్ద ఉన్న రెండు బ్యాగుల్లో ఈ తుపాకులను గుర్తించారు. వాటిని తన సోదరుడు మంజీతి సింగ్ ఇచ్చినట్టు జగ్జీత్ వద్ద జరిపిన విచారణలో వెల్లడించారు. 
 
ఈ పిస్టళ్లను మంజీత్ సింగ్ ఫ్రాన్స్‌లోని పారిస్ నుంచి వియత్నాంకు తెచ్చి తమకు ఇచ్చారని, వాటిని తాము ఢిల్లీకి తీసుకొచ్చినట్టు చెప్పారు. పైగా, గతంలో తామిద్దరం టర్కీ నుంచి 25 పిస్టళ్లను కూడా తెచ్చినట్టు ఈ దంపతులు పోలీసుల విచారణలో వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దక్షిణ ఒరిశాపై అల్పపీడనం - కోస్తాకు వర్ష సూచన