Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఫ్లాట్లలో రూ. 49.8 కోట్లా, అవి ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలీదు: అర్పితా ముఖర్జీ

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (15:53 IST)
బడా వ్యక్తులు కుంభకోణాలను చూస్తే కళ్లు తిరిగిపోతుంటాయి. కోట్ల రూపాయలు వెనకేసేస్తారు. బెంగాల్ మాజీమంత్రి పార్థ ఛటర్జీ ఎస్ఎస్సి రిక్రూట్మెంట్ కుంభకోణంలోనూ ఇలాంటి సంచలన విషయాలే బయటపడుతున్నాయి. కోల్‌కతాలోని తన ఫ్లాట్లలో స్వాధీనం చేసుకున్న నగదు తనది కాదని అరెస్టైన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ పేర్కొన్నారు.

 
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణలో ఆమె ఈ మేరకు వెల్లడించారు. టోలీగంజ్, బెల్ఘరియాలోని తన రెండు ఫ్లాట్లలో స్వాధీనం చేసుకున్న రూ. 49.8 కోట్ల నగదు ఎలా వచ్చిందో తనకు తెలియదని విస్మయం వ్యక్తం చేసింది. అంతేకాదు... ఆ డబ్బును తను లేని సమయంలో పెట్టి వుంటారనీ, దాని గురించి తనకు తెలియదని ముఖర్జీ చెప్పినట్లు ఏఎన్ఐ వార్త సంస్థ పేర్కొంది.

 
గత నెల, కోల్‌కతాలో జరిగిన దాడుల తర్వాత SSC రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి బెంగాల్ మాజీ మంత్రితో పాటు అర్పితా ముఖర్జీని అరెస్టు చేశారు. ఈడీ సోదాల్లో కోట్ల విలువైన నగలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments