Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతిండియాలో ఎక్కడైనా.. ఎపుడైనా ఉగ్రదాడి జరగొచ్చు : ఆర్మీ హెచ్చరిక

Webdunia
సోమవారం, 9 సెప్టెంబరు 2019 (16:21 IST)
దక్షిణ భారతదేశంలో ఎపుడైనా, ఎక్కడైనా దాడి జరగొచ్చని ఆర్మీ హెచ్చరించింది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు ఈ దాడులకు తెగబడే అవకాశం ఉందని లెఫ్టినెంట్ జనరల్ ఎస్కే సైనీ హెచ్చరించారు. 
 
దక్షిణాది రాష్ట్రాల్లో ఎప్పుడైనా ఉగ్రదాడి జరిగే అవకాశముందని తమకు నిఘా సమాచారం అందిందని ఆర్మీ సదరన్ కమాండ్‌కు చెందిన లెఫ్లినెంట్ జనరల్ ఎస్కే సైనీ తెలిపారు. భారత్-పాక్ మధ్య గుజరాత్ వెంట ఉన్న సర్ క్రీక్ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న కొన్ని ఖాళీ పడవలను తాము గుర్తించామని వెల్లడించారు. ఈ పడవుల ద్వారా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడివుంటారని తాము అనుమానిస్తున్నట్టు చెప్పారు. 
 
అయితే, ఎలాంటి ఉగ్రదాడి, దుశ్చర్య జరగకుండా తాము చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2008, నవంబర్ 26న ఇదే తరహాలో సముద్ర మార్గం ద్వారా  ముంబైకి చేరుకున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు మహానగరంలో మారణహోమం సృష్టించిన విషయం తెల్సిందే. 
 
ఈ దుర్ఘటనలో 140 మంది భారతీయులు, 25 మంది విదేశీ పర్యాటకులతో సహా 9 మంది ఉగ్రవాదులు కూడా చనిపోయారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాది కసబ్‌ సజీవంగా పట్టుబడగా అతనికి ఉరిశిక్ష అమలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments