Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదుకు ఆదేశం

ఠాగూర్
శనివారం, 28 సెప్టెంబరు 2024 (08:45 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌పై కేసు నమోదుకు బెంగుళూరు కోర్టు ఆదేశించింది. పార్టీ నిధుల కోసం ఆమె దేశంలోని పలువురు పారిశ్రామికవేత్తల నుంచి బెదిరించి, వారి నుంచి పెద్ద మొత్తంలో నగదును ఎలక్టోరల్ బాండ్ల్ పేరిట బీజేపీ పార్టీ అధికారిక ఖాతాలకు బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు జనాధికార సంఘర్ష పరిషత్ సంస్థకు చెందిన ఆదర్శ్ అయ్యర్ గతంలో ఆరోపించారు. ఇవి ముమ్మాటికీ నిజమనే పేర్కొంటూ ఆయన తిలక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మాలా సీతామన్‌పై వెంటనే కేసు నమోదు చేయాలని బెంగుళూరులోని తిలక్ నగర్ ఠాణా పోలీసులను చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. 
 
కాగా, ఆదర్శ్ అయ్యర్ నిర్మలపై కేసు నమోదు చేయాలని కోరగా వారు పట్టించుకోకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి సంతోష్ గజానన హెగ్డే.. కేంద్రమంత్రి నిర్మలమ్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే, తదుపరి విచారణను వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేశారు. ఇప్పటికైనా పోలీసులు కేంద్ర మంత్రిపై కేసు నమోదు చేస్తారో లేదో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments