Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదుకు ఆదేశం

ఠాగూర్
శనివారం, 28 సెప్టెంబరు 2024 (08:45 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌పై కేసు నమోదుకు బెంగుళూరు కోర్టు ఆదేశించింది. పార్టీ నిధుల కోసం ఆమె దేశంలోని పలువురు పారిశ్రామికవేత్తల నుంచి బెదిరించి, వారి నుంచి పెద్ద మొత్తంలో నగదును ఎలక్టోరల్ బాండ్ల్ పేరిట బీజేపీ పార్టీ అధికారిక ఖాతాలకు బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు జనాధికార సంఘర్ష పరిషత్ సంస్థకు చెందిన ఆదర్శ్ అయ్యర్ గతంలో ఆరోపించారు. ఇవి ముమ్మాటికీ నిజమనే పేర్కొంటూ ఆయన తిలక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మాలా సీతామన్‌పై వెంటనే కేసు నమోదు చేయాలని బెంగుళూరులోని తిలక్ నగర్ ఠాణా పోలీసులను చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. 
 
కాగా, ఆదర్శ్ అయ్యర్ నిర్మలపై కేసు నమోదు చేయాలని కోరగా వారు పట్టించుకోకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి సంతోష్ గజానన హెగ్డే.. కేంద్రమంత్రి నిర్మలమ్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే, తదుపరి విచారణను వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేశారు. ఇప్పటికైనా పోలీసులు కేంద్ర మంత్రిపై కేసు నమోదు చేస్తారో లేదో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments