Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ భార్య తన భర్తను మరో మహిళతో పంచుకోవాలని కోరుకోదు : అలహాబాద్ హైకోర్టు

Webdunia
మంగళవారం, 3 మే 2022 (15:13 IST)
భార్యాభర్తల బంధంపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ ఒక్క భార్య కూడా తన భర్తను పరాయి మహిళతో పంచుకోవాలని కోరుకోదని వ్యాఖ్యానించింది. అందువల్ల అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యకు తెలియకుండా రహస్యంగా మరో పెళ్లి చేసుకోవడం నేరమేనని అలహాబాద్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. 
 
భార్య ఆత్మహత్యకు పురిగొల్పాడంటూ కింద కోర్టు నమోదు చేసిన అభియోగాలను కొట్టి వేయాలని కోరుతూ ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై జస్టిస్ రాహుల్ చతుర్వేది సారథ్యంలోని హైకోర్టు ధర్మానసం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ పిటిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
నిందితుడు ఒకరికి తెలియకుండా ఒకరి చొప్పున మొత్తం మూడు పెళ్లిళ్లు చేసుకుందని, అందువల్ల అతడి భార్య ఆత్మహత్య చేసుకుందని వ్యాఖ్యానించింది. ఓ భార్య తన ప్రాణాలు తీసుకోవడానికి కట్టుకున్న భర్త రహస్యంగా మరో పెళ్లి చేసుకోవడమన్న ఒక్క కారణం చాలని ధర్మాసనం అభిప్రాయపడింది. మరో మహిళతో కలసి తన భర్త కాపురాన్ని పంచుకోవాలనుకోవడం ఓ భార్యకు శరాఘాతమేనని అన్నారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments