Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారణాసిలో మోదీకి పోటీగా ప్రియాంకా గాంధీనా...? అవసరమా?

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (14:18 IST)
ఉత్తరప్రదేశ్, వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ కీలక నేత ప్రియాంకా గాంధీ ఎదుర్కోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ తరపున అజయ్ రాయ్ వారణాసిలో మోదీతో పోటీగా బరిలోకి దిగుతున్నారు. వారణాసి నియోజకవర్గానికి గాను.. బీజేపీ తరపున ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. శుక్రవారం ఈ మేరకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. 
 
ఈ నేపథ్యంలో వారణాసిలో మోదీతో బరిలోకి దించే అభ్యర్థి పేరును కాంగ్రెస్ ప్రకటించకుండా సస్పెన్స్‌లో వుంచింది. అయితే వారణాసిలో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీని పోటీకి దించుతారని జోరుగా ప్రచారం సాగింది. ప్రియాంక గాంధీ ఈ నెల 29వ తేదీ నామినేషన్ దాఖలు చేసే అవకాశం వున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ వారణాసిలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థిని ఆ పార్టీ గురువారం ప్రకటించింది.
 
ఇందులో భాగంగా అజయ్ రాయ్ పేరును తెరపైకి తెచ్చింది. గోరఖ్ పూర్ నియోజకవర్గంలో మదుసూధన్ తివారీ పోటీ చేస్తున్నట్లు కూడా కాంగ్రెస్ ప్రకటన చేసింది. దీంతో వారణాసిలో ప్రియాంక గాంధీ పోటీకి దించే విషయంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గిందని టాక్ వస్తోంది. మోదీతో ప్రియాంక పోటీ వద్దని కాంగ్రెస్ సీనియర్ నేతలు సలహా ఇవ్వడంతోనే ఆమెను మోదీ పోటీ చేసే వారణాసిలో బరిలోకి దించలేదని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments