Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదేళ్ళ కాలంలో మూడు రెట్లు పెరిగిన మమతా బెనర్జీ మేనల్లుడి ఆస్తులు

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (14:14 IST)
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఉన్నారు. ఈమె ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగాను, ఓ పార్టీ అధినేత్రిగా ఉన్నప్పటికీ అతి సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. చివరకు సీఎం చాంబర్‌లో కూడా ఆమె చెక్క కుర్చీలోనే కూర్చొంటారు. 
 
కానీ, ఆమె కుటుంబీకులు మాత్రం అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోటాను కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దీనికి నిదర్శనమే ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ. ఈయన 2014లో తొలిసారి డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలుపొందారు. 
 
ఇప్పుడు కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. నాడు ఆయన చరాస్తులు రూ.23.57 లక్షలు ఉండగా.. ఇప్పుడు ఆ ఆస్తులు మూడు రెట్లు పెరిగాయి. ఇటీవల దాఖలు చేసిన నామినేషన్‌ పత్రంలో తనకున్న చరాస్తుల విలువ రూ.71.4 లక్షలుగా అభిషేక్‌ బెనర్జీ చూపించారు. 
 
వీటితోపాటు రూ.96 వేల విలువ చేసే 30 గ్రాముల బంగారం, రూ.1500 విలువ చేసే 40 గ్రాముల వెండి ఉన్నట్లు తెలిపారు. అభిషేక్‌ భార్య పేరిట రూ.1.5 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ఆయన తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆయన భార్య పేరిట భార్య పేరిట 658 గ్రాముల బంగారం, 2.3 కేజీల వెండి ఉన్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments