Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

ఠాగూర్
ఆదివారం, 15 జూన్ 2025 (11:37 IST)
ఇటీవల అహ్మదాబాద్ నగరంలో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయిన వారిలో వడోదరాకు చెందిన యాస్మిన్ వోరా (51), ఆమె మేనల్లుడు పర్వేజ్ వోరా (30), ఆయన నాలుగేళ్ళ కుమార్తె జువేరియాలు ఉన్నారు. ఈ వార్త వారి కుటుంబ సభ్యులను, బంధువులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
 
యాస్మిన్ వోరాకు వాస్తవానికి జూన్ 9వ తేదీనే లండన్‌కు ప్రయాణం కావాల్సివుంది. అయితే థాస్రాకు చెందిన తన మేనల్లుడు పర్వేజ్, అతని కుమార్తె జువేరియాతో కలిసి ప్రయాణించేందుకు ఆమె తన ప్రయాణ టిక్కెట్‌ను 12వ తేదీకి మార్చుకుని, చివరకు మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని తలచకుని యాస్మిన్ భర్త బోరున విలపిస్తున్నాడు. 
 
పైగా, ప్రమాదం జరిగిన రోజున యాస్మిన్‌ను ఆమె భర్త యాసిన్ స్వయంగా విమానాశ్రయంలో వదిలిపెట్టారు. విమానం టేకాఫ్ కావడానికి కొన్ని నిమిషాల ముందు యాస్మిన్ తన భర్త యాసిన్‌కు ఫోన్ చేసి విమానంలో ఏసీ సరిగ్గా పని చేయడం లేదని, తనకు ఏదో తెలియని ఆందోళనగా, అదోలా అనిపిస్తోందని చెప్పినట్టు యాసిన్ గుర్తుచేసుకున్నారు. అలాంటిదేమీ ఉండదు. కాసేపటికి ఏసీ ఆన్ అవుతుంది. అని నేను ఆమెకు ధైర్యం చెప్పాను అని ఆయన తన భార్యతో జరిగిన చివరి సంభాషణ తలచకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments