పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాలకు విమాన సర్వీసులు రద్దు

ఠాగూర్
మంగళవారం, 13 మే 2025 (09:26 IST)
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ సైన్యం డ్రోన్లను ప్రయోగిస్తూనే ఉంది. దీంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ఇండియా, ఇండిగో విమాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేసింది. ఈ మేరకు ఇరు సంస్థలు ఓ ప్రకటన చేశాయి. 
 
'తాజా పరిణామాలు, ప్రయాణికులు భద్రతను దృష్టిలో ఉంచుకుని జమ్మూ, లేహ్, జోధ్‌పూర్, అమృతసర్, భుజ్, జామ్ నగర్, చండీఘడ్‌, రాజ్‌‍కోట్ నగరాలకు మంగళవారం నుంచి విమాన రాకపోకలు నిలిపివేస్తున్నాం. పరిస్థితులు నిశితంగా గమనిస్తున్నాం. అప్‌డేట్‌లను ఎప్పటికపుడు ప్రకటిస్తాం' అని ఎయిరిండియా తమ ప్రకటనలో వెల్లడించింది. 
 
అటు ఇండిగో కూడా ఇదే విధమైన ప్రకటన చేసింది. 'ప్రయాణికులు భద్రతే మాకు అత్యంత ప్రాధాన్యం. దీనివల్ల మీ ప్రయాణ ప్రయాణికలకు అంతరాయం ఏర్పడినప్పటికీ రద్దు చేయక తప్పట్లేదు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణ చెబుతున్నా' అని కంపెనీ పేర్కొంది. శ్రీనగర్, లేహ్, రాజ్‌‍కోట్, చండీఘడ్, జమ్మూ, అమృతసర్ ప్రాంతాలకు ఇండిగో విమాన సర్వీసులను నిలిపివేసింది. 
 
వాస్తవానికి సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కాస్త సద్దుమణిగినట్టు అనిపించడంతో సోమవారం నుంచి 32 విమానాశ్రయాలను తిరిగి అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీంతో విమాన సేవలను పునరుద్ధరించేందుకు ఎయిర్ లైన్లు కూడా సిద్ధమయ్యాయి. అయితే, జమ్మూకాశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో సోమవారం రాత్రి డ్రోన్ల కదలికలు కనిపించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments