Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుచ్చిలో ఫ్లైట్ సేఫ్ ల్యాండింగ్.. ప్రయాణికులకు పోయిన ప్రాణం తిరిగొచ్చింది..

ఠాగూర్
శుక్రవారం, 11 అక్టోబరు 2024 (20:42 IST)
తిరుచ్చి నుంచి షార్జా వెళ్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విమానంలో హైడ్రాలిక్‌ వ్యవస్థ పనిచేయలేదు. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే పైలెట్లు ఎమర్జెన్సీ ప్రటించారు. దీంతో తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌లో పెద్దసంఖ్యలో పారా మెడిక్‌ సిబ్బంది, 20 ఫైర్‌ ఇంజిన్లు, 20 అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. పైగా, ల్యాండిగ్ సమస్య ఉత్పన్నం కావడంతో గంటన్నరకుపైగా గాల్లోనే చక్కర్లు విమానాన్ని పైలెట్లు చక్కర్లు కొట్టించారు. అయితే, పైలెట్లు చాకచక్యంగా విమానాన్ని సేఫ్ ల్యాండింగ్ చేశారు. దీంతో ఏఎక్స్‌బీ 613 విమానంలోని 141 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయపడ్డారు. 
 
అంతకుముందు తిరుచ్చి విమానాశ్రయంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తిరుచ్చి విమానాశ్రయం నుంచి షార్జాకు బయలుదేరిన విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ఈ విమానం షార్జాకు వెళ్లకుండా తిరిగి తిరుచ్చికే వచ్చింది. అయితే, విమానం ల్యాండింగ్ కావడంలో సమస్య ఏర్పడింది. దీంతో విమానం గాల్లోలోనే చక్కర్లు కొట్టించారు. ఈ విమానంలో 141 మంది ప్రయాణికులు ఉన్నారు. 
 
టేకాఫ్ అయిన కొద్ది సేపటికే హైడ్రాలిక్‌ వ్యవస్థ పనిచేయడం లేదని గుర్తించిన పైలట్లు.. తిరుచ్చి విమానాశ్రయాన్ని అప్రమత్తం చేశారు. దీంతో తిరుచ్చి ఎయిర్‌పోర్టులో సురక్షిత ల్యాండింగ్‌ కోసం ఏర్పాట్లు చేశారు. దాదాపు 2 గంటల 5 నిమిషాల పాటు గగనతలంలో చక్కర్లు కొట్టిన తర్వాత విమానాన్ని సురక్షితంగా పైలెట్లు ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులతో పాటు.. ఎయిర్‌పోర్టు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments