Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పని చేయని హైడ్రాలిక్ సిస్టమ్ - ఎయిరిండియా విమానానికి ల్యాండింగ్ సమస్య.. తిరుచ్చి ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ

airindia

ఠాగూర్

, శుక్రవారం, 11 అక్టోబరు 2024 (20:24 IST)
తిరుచ్చి విమానాశ్రయంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తిరుచ్చి విమానాశ్రయం నుంచి షార్జాకు బయలుదేరిన విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ఈ విమానం షార్జాకు వెళ్లకుండా తిరిగి తిరుచ్చికే వచ్చింది. అయితే, విమానం ల్యాండింగ్ కావడంలో సమస్య ఏర్పడింది. దీంతో విమానం గాల్లోలోనే చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఈ విమానంలో 140 మంది ప్రయాణికులు ఉన్నారు. 
 
దీంతో ఎయిరిండియా విమానం గాల్లో ఉండగానే పైలట్లు ఎమర్జెన్సీ ప్రకటించారు. హైడ్రాలిక్‌ వ్యవస్థ పనిచేయడం లేదని గుర్తించిన పైలట్లు.. తిరుచ్చి విమానాశ్రయాన్ని అప్రమత్తం చేశారు. తమిళనాడులోని తిరుచ్చి మీదుగా వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో తిరుచ్చి ఎయిర్‌పోర్టులో సురక్షిత ల్యాండింగ్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ల్యాండింగ్‌కు అరగంట సమయం పట్టనుందని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆ విమానం ల్యాండింగ్‌పై ఉత్కంఠ నెలకొంది.
 
అత్యవసర పరిస్థితుల్లో విమానం సురక్షిత ల్యాండింగ్‌ కావాలంటే అందులో ఉన్న ఇంధనం నిర్దేశిత స్థాయి వరకు తగ్గాల్సి ఉంటుంది. అప్పుడే విమానం ల్యాండింగ్‌ చేసే వీలుంటుంది. ఈ నేపథ్యంలో సురక్షిత ల్యాండింగ్‌ కోసం ప్రయత్నిస్తున్న పైలట్లు.. దాదాపు గంట నుంచి గాల్లోనే చక్కర్లు కొడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2024 నోబెల్ శాంతి బహుమతి ఎవరికిచ్చారు?