Webdunia - Bharat's app for daily news and videos

Install App

పని చేయని హైడ్రాలిక్ సిస్టమ్ - ఎయిరిండియా విమానానికి ల్యాండింగ్ సమస్య.. తిరుచ్చి ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ

ఠాగూర్
శుక్రవారం, 11 అక్టోబరు 2024 (20:24 IST)
తిరుచ్చి విమానాశ్రయంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తిరుచ్చి విమానాశ్రయం నుంచి షార్జాకు బయలుదేరిన విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ఈ విమానం షార్జాకు వెళ్లకుండా తిరిగి తిరుచ్చికే వచ్చింది. అయితే, విమానం ల్యాండింగ్ కావడంలో సమస్య ఏర్పడింది. దీంతో విమానం గాల్లోలోనే చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఈ విమానంలో 140 మంది ప్రయాణికులు ఉన్నారు. 
 
దీంతో ఎయిరిండియా విమానం గాల్లో ఉండగానే పైలట్లు ఎమర్జెన్సీ ప్రకటించారు. హైడ్రాలిక్‌ వ్యవస్థ పనిచేయడం లేదని గుర్తించిన పైలట్లు.. తిరుచ్చి విమానాశ్రయాన్ని అప్రమత్తం చేశారు. తమిళనాడులోని తిరుచ్చి మీదుగా వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో తిరుచ్చి ఎయిర్‌పోర్టులో సురక్షిత ల్యాండింగ్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ల్యాండింగ్‌కు అరగంట సమయం పట్టనుందని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆ విమానం ల్యాండింగ్‌పై ఉత్కంఠ నెలకొంది.
 
అత్యవసర పరిస్థితుల్లో విమానం సురక్షిత ల్యాండింగ్‌ కావాలంటే అందులో ఉన్న ఇంధనం నిర్దేశిత స్థాయి వరకు తగ్గాల్సి ఉంటుంది. అప్పుడే విమానం ల్యాండింగ్‌ చేసే వీలుంటుంది. ఈ నేపథ్యంలో సురక్షిత ల్యాండింగ్‌ కోసం ప్రయత్నిస్తున్న పైలట్లు.. దాదాపు గంట నుంచి గాల్లోనే చక్కర్లు కొడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments