Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఠాగూర్
ఆదివారం, 15 జూన్ 2025 (17:57 IST)
ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి దేశ ప్రజలు ఇంకా తేరుకోలేనే లేదు. ఈ ప్రమాదంలో విమానంలోని 242 మంది ప్రయాణికుల్లో ఏకంగా 241 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరంతా గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. ఇదిలావుంటే మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ విమానం ఏకంగా కొన్ని గంటల పాటు పాటు రన్‌వేపై ఉండాల్సివచ్చింది. ఈ ఘటనపై సదరు సంస్థ స్పందించింది. 
 
వివరాలను పరిశీలిస్తే, ఎయిరిండియా విమానం ఎక్స్ 1,511 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ విమానాశ్రయం నుంచి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాకు బయలుదేరాల్సివుంది. టేకాఫ్ అయిన కాసేపటికే ముందు విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. దీన్ని వెంటనే గుర్తించిన సంస్థ అప్రమత్తమైంది. దీంతో విమాన ప్రయాణాన్ని నిలిపివేసింది. కొన్ని గంటలు ఆలస్యంగా బయలుదేరనుందని తెలిపింది. 
 
అలాగే, ఈ ఘటనపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ, టేకాఫ్‌కి కాసేపు ముందే సాంకేతిక లోపాన్ని గుర్తించాం. ఆలస్యం కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. వారికి రీషెడ్యూల్ లేదా రీఫండ్ చేసేందుకు సంస్థ సిద్ధంగా ఉంది అని ఓ ప్రటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments