Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్నిపథ్‌పై తప్పుడు ప్రచారం - 35 వాట్సాప్ గ్రూపులపై నిషేధం

Webdunia
సోమవారం, 20 జూన్ 2022 (11:06 IST)
సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నివీరుల పథకం గురించి తప్పుడు ప్రచారం చేసిన 35 వాట్సాప్ గ్రూపులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ పథకానికి వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు, హింసాత్మక సంఘటనలు, రైళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెట్టడం తదితర ఘటనల నేపథ్యంలో కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులోభాగంగా, 35 వాట్సాప్ గ్రూపులపై నిషేధం విధించింది. 
 
అంతేకాకుండా ఇలాంటి ఘటనలపై వాస్తవాల తనిఖీల కోసం పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ 87997 11259 అనే నంబరులో నివేదించాలని దేశ పౌరులకు కేంద్రం సూచనలు చేసింది. ఈ నెల 17వ తేదీన బీహార్ ప్రభుత్వం తన 12 జిల్లాల్లో ఆదివారం వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన విషయం తెల్సిందే. 
 
ప్రజలను రెచ్చగొట్టేందుకు, ఆస్తిని నష్టం కలిగించే ఉద్దేశంతో పుకార్లను వ్యాప్తి చేసేందుకు అభ్యంతరకరమైన కంటెంట్‌ను ప్రసారం చేయడానికి ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంటూ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఇపుడు కేంద్రం కూడా స్పందించి అగ్నిపథ్‌పై తప్పుడు ప్రచారం చేసిన 35 వాట్సాప్ గ్రూపులను గుర్తించి నిషేధం విధించింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments