Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో లెఫ్ట్ పార్టీలకు చోటు లేకుండా చేస్తాం : అమిత్ షా

దేశంలో వామపక్ష పార్టీలకు చోటు లేకుండా చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జోస్యం చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం విడ

Webdunia
ఆదివారం, 4 మార్చి 2018 (12:17 IST)
దేశంలో వామపక్ష పార్టీలకు చోటు లేకుండా చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జోస్యం చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో బీజేపీ రెండు చోట్ల విజయభేరీ మోగించింది. 
 
ఈ ఫలితాలపై ఆయన మాట్లాడుతూ, త్రిపుర ఎన్నికల్లో బీజేపీ విజయానికి ప్రధాని నరేంద్ర మోడీ 'యాక్ట్ ఈస్ట్ పాలసీ'నే కారణమన్నారు. వివిధ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయానికి దోహదపడుతుందన్నారు. తమకు విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
 
నరేంద్ర మోడీ నాయకత్వంపై ఈశాన్య రాష్ట్రాల ప్రజలు అచంచల విశ్వాసంతో ఉన్నారన్నారు. ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ రోజురోజుకు కునారిల్లుతోందని, తాజా ఎన్నికల్లో అది నిరూపితమైందన్నారు. త్రిపుర, నాగాలాండ్‌లలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. అనేక చోట్ల ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments