Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ గేమ్ కోసం.. 12 ఏళ్ల బాలుడు తల్లి బంగారాన్ని అమ్మేశాడు..

Webdunia
శనివారం, 10 జులై 2021 (11:54 IST)
ఆన్‌లైన్ గేమ్స్‌కి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం చివరికి పిల్లల చేతికి ఫోన్ రావడంతో ఎన్నో అనర్థాలు కూడా జరిగిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఎంతో మంది చిన్నారులు ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ చివరికి ఇక ఈ గేమ్‌లకి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలను జతచేసి భారీగా మోసపోయిన ఘటనలు ఎన్నో మీదికి వచ్చాయి. 
 
ఇక్కడ మాత్రం అంతకుమించి అనే ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఏకంగా 12ఏళ్ల బాలుడు తన తల్లి బంగారాన్ని అమ్మేశాడు. మొబైల్ గేమ్ కోసం ఇలా చేశాడు 12 ఏళ్ల బాలుడు. ఇక ఆ తర్వాత ఇంట్లో ఏం అంటారో అన్న భయంతో ఇంట్లో నుంచి పారిపోయాడు.
 
ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన 12 ఏళ్ల బాలుడు గత కొంత కాలంగా ఆన్‌లైన్‌లో ఒక వీడియో గేమ్ ఆడుతున్నాడు. అయితే ఈ గేమ్ ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించి ఇక ఆయుధాలు కొనాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ పిల్లాడు ఒక దారుణమైన ఆలోచన చేశాడు. 
 
ఏకంగా తల్లి బంగారం 20 వేలకు అమ్మేశాడు. ఆ తర్వాత ఆన్లైన్ గేమ్‌లో ఆయుధాలను కొన్నాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ఇక ఇంట్లో వాళ్లకు ఈ విషయం తెలిస్తే మాత్రం ఏం జరుగుతుందో అని భయపడి పోయాడు. దీంతో ఇక ఇంట్లో నుంచి పారిపోయాడు. పోలీసులు గ్రహించి అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments