Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో విషాదం : పుణ్యస్నానానికెళితే ప్రాణాలు పోయాయి...

Webdunia
శనివారం, 10 జులై 2021 (11:38 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి సరయూ నదిలో రెండు కుటుంబాలకు చెందిన 15 మంది నీట మునిగారు. వీరిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా ముగ్గురిని అధికారులు రక్షించారు. మరో ముగ్గురు గల్లంతు కాగా.. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆగ్రా నుంచి రెండు కుటుంబాలకు చెందిన 15 మంది.. అయోధ్య పర్యటనకు వచ్చారు. సరయూ నది గుప్తార్ ఘాట్ వద్ద శుక్రవారం.. స్నానం చేసేందుకు వారంతా నీటిలో దిగారు. వారిలో ఓ మహిళ నీట మునగటంతో ఆమెను కాపాడే ప్రయత్నంలో 15 మంది నీట మునిగారు. 
 
అందులో ముగ్గురు వ్యక్తులు తమంతట తాముగా ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకున్నారు. ఆరుగు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న జిల్లా మేజిస్ట్రేట్ అనూజ్ కుమార్ ఝా, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శైలేష్ పాండే ఘటనాస్థలికి చేరుకున్నారు. 
 
ప్రాణాలతో బయటపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన వారికోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎప్, పీఏసీ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయని ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ వినయ్ కుమార్ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments