Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండోసారి కూడా ఆదిత్యం ఎల్-1 కక్ష్య పెంపు విన్యాసం సక్సెస్

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (10:50 IST)
సూర్యుడి గుట్టును ఛేదించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన ఆదిత్యం ఎల్-1 రాకెట్ ప్రయోగ పరీక్ష విజయవంతంగా సాగుతోంది. ఇందులోభాగంగా, ఈ రాకెట్ కక్ష్య పెంపు విన్యాసం రెండోసారి కూడా విజయంతంగా పూర్తి చేశారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలుక కక్ష్య పెంపు విన్యాసం పూర్తి చేశారు. ఈ నెల 10వ తేదీన 2.30 గంటలకు మూడోసారి కక్ష్య పెంపును చేపట్టనున్నారు. ప్రస్తుతం 282x40,225 కిలోమీటర్ల కక్ష్యంలో ఆదిత్య ఎల్-1 పరిభ్రమిస్తుందని ఇస్రో ప్రకటించింది. బెంగళూరు, పోర్ట్ బ్లెయిర్‌ని గ్రౌండ్ స్టేషన్లు ఆదిత్య గమనాన్ని పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.
 
శనివారం శ్రీహరికోట నుంచి బయలుదేరిన ఆదిత్య ఎల్-1ను హాలో ఆర్బిట్ అయిన లాంగ్రాంజియన్ పాయింట్-1 (ఎల్-1) లో ప్రవేశపెడతారు. ఈ పాయింట్ భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రయోగంలో ఉపగ్రహం సూర్యుడికి సమీపంగా వెళ్లడం కానీ, సూర్యుడి మీద లాండింగ్ కానీ ఉండదని ఇస్రో స్పష్టం చేసింది. వచ్చే ఐదేళ్లపాటు ఈ ఉపగ్రహం ఆదిత్యుడికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి పంపిస్తుంది. ఆ తర్వాత కూడా మరో 10-15 సంవత్సరాల వరకు అది పనిచేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments