Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. రూ.5కోట్లు డిమాండ్ చేస్తున్నారు.. రేవణ్ణ సోదరుడు

సెల్వి
శనివారం, 22 జూన్ 2024 (11:39 IST)
తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని లైంగిక నేరాల నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు ఆరోపించాడు. ప్రజ్వల్ రేవణ్ణను జ్యుడీషియల్ కస్టడీకి పంపిన కొద్ది రోజులకే ఇది జరిగింది.
 
కర్ణాటకలోని హసన్‌లో తనను లైంగిక వేధింపుల తప్పుడు కేసుతో బెదిరిస్తున్నారని పలువురు మహిళల లైంగిక నేరాల ఆరోపణలను ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జనతాదళ్-సెక్యులర్ నాయకుడు సూరజ్ రేవణ్ణ ఆరోపించారు.
 
సూరజ్ రేవణ్ణ స్నేహితుడు శివకుమార్ ఇద్దరు వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. చేతన్, అతని బావ తనను సంప్రదించి రూ.5 కోట్లు డిమాండ్ చేశారని, తమ డిమాండ్లను నెరవేర్చకుంటే సూరజ్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు పెడతానని బెదిరించారని శివకుమార్ ఆరోపించారు.
 
తనకు ఉద్యోగం ఇప్పించాలని చేతన్ మొదట తనను సంప్రదించినట్లు శివకుమార్ తెలిపాడు. శివకుమార్ అతనికి సూరజ్ రేవణ్ణ నంబర్ ఇచ్చి సూరజ్‌ని సంప్రదించమని అడిగాడు. అయితే ఉద్యోగం రాకపోవడంతో శివకుమార్, సూరజ్‌లను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం