అభినందన్‌కు కీలక పరీక్షలు.. శత్రుదేశం టార్చర్ చేసిందా అని?

Webdunia
శనివారం, 2 మార్చి 2019 (11:28 IST)
జమ్మూకాశ్మీర్ ఆక్రమిత పాకిస్థాన్‌లో ప్యారాచూట్ నుంచి దిగిన కమాండర్ అభినందన్.. శుక్రవారం భారత్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. అభినందన్‌ భారత్‌ రాగానే ఘనస్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో అభినందన్‌కు కొన్ని కీలకమైన వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు  ఆయన ఫిట్‌నెస్‌ స్థాయి ఏ మేరకు ఉందనే దాన్ని పరీక్షిస్తారు. 
 
అనంతరం ఆయన శరీరంలో పాక్‌ ఆర్మీ ఏమైనా బగ్‌ను అమర్చిందా? అనేది తెలుసుకునేందుకు స్కానింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. అంతేకాదు.. ఆయన మానసిక పరిస్థితి, ఆలోచనా విధానం ఏ విధంగా ఉందో పరీక్షిస్తారు. అభినందన్‌ నుంచి సమాచారం రాబట్టేందుకు శత్రుదేశం అతడిని టార్చర్‌ చేసిందా? అనే విషయానికి సంబంధించి వివరాలను సేకరిస్తారు.
 
ఇదిలా ఉంటే.. తన మొబైల్‌ ఫోన్‌లో పాకిస్థాన్‌ సిమ్‌ను కలిగి ఉండి, అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని సరిహద్దు రక్షణ దళం (బీఎస్‌ఎఫ్‌) శుక్రవారం అరెస్టు చేసింది. పంజాబ్‌లోని సరిహద్దు ప్రాంతమైన ఫిరోజ్‌పూర్‌లో పట్టుబడ్డ అతడు పాక్‌ గూఢచారి అయ్యుండవచ్చని బీఎస్‌ఎఫ్‌ వర్గాలు అనుమానిస్తున్నాయి. అతడి నెంబరు ఎనిమిది పాకిస్థాన్‌ వాట్సాప్‌ గ్రూపుల్లో ఉందని, ఆ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dharmendra Health Update: ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా వుంది.. ఇషా డియోల్

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

జూటోపియా 2 లో జూడీ హాప్స్‌కి వాయిస్‌ ఇచ్చిన శ్రద్ధా కపూర్‌

Faria Abdullah: సందీప్ కిషన్ హీరోగా సిగ్మా పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments