Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభినందన్‌కు కీలక పరీక్షలు.. శత్రుదేశం టార్చర్ చేసిందా అని?

Webdunia
శనివారం, 2 మార్చి 2019 (11:28 IST)
జమ్మూకాశ్మీర్ ఆక్రమిత పాకిస్థాన్‌లో ప్యారాచూట్ నుంచి దిగిన కమాండర్ అభినందన్.. శుక్రవారం భారత్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. అభినందన్‌ భారత్‌ రాగానే ఘనస్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో అభినందన్‌కు కొన్ని కీలకమైన వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు  ఆయన ఫిట్‌నెస్‌ స్థాయి ఏ మేరకు ఉందనే దాన్ని పరీక్షిస్తారు. 
 
అనంతరం ఆయన శరీరంలో పాక్‌ ఆర్మీ ఏమైనా బగ్‌ను అమర్చిందా? అనేది తెలుసుకునేందుకు స్కానింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. అంతేకాదు.. ఆయన మానసిక పరిస్థితి, ఆలోచనా విధానం ఏ విధంగా ఉందో పరీక్షిస్తారు. అభినందన్‌ నుంచి సమాచారం రాబట్టేందుకు శత్రుదేశం అతడిని టార్చర్‌ చేసిందా? అనే విషయానికి సంబంధించి వివరాలను సేకరిస్తారు.
 
ఇదిలా ఉంటే.. తన మొబైల్‌ ఫోన్‌లో పాకిస్థాన్‌ సిమ్‌ను కలిగి ఉండి, అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని సరిహద్దు రక్షణ దళం (బీఎస్‌ఎఫ్‌) శుక్రవారం అరెస్టు చేసింది. పంజాబ్‌లోని సరిహద్దు ప్రాంతమైన ఫిరోజ్‌పూర్‌లో పట్టుబడ్డ అతడు పాక్‌ గూఢచారి అయ్యుండవచ్చని బీఎస్‌ఎఫ్‌ వర్గాలు అనుమానిస్తున్నాయి. అతడి నెంబరు ఎనిమిది పాకిస్థాన్‌ వాట్సాప్‌ గ్రూపుల్లో ఉందని, ఆ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్పారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments