Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైషే మసూద్ అజహర్.. మా దేశంలోనే వున్నాడు.. పాక్ మంత్రి

Webdunia
శనివారం, 2 మార్చి 2019 (11:02 IST)
భారత్‌లో పలు ఉగ్రదాడుల సూత్రధారి, జైషే మహమ్మద్‌ అధినేత మసూద్‌ అజహర్‌ తమ దేశంలోనే ఉన్నట్లు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి ప్రకటించారు. అతడు పాకిస్థాన్‌లో వున్నాడని.. అయితే తీవ్ర అనారోగ్యంతో వున్నట్లు తెలిపారు. పుల్వామా దాడి గురించి జైషే ఉగ్రవాద సంస్థల నాయకులను సంప్రదించామని.. వారు ఈ దాడి చేయలేదని చెప్పారు. 
 
నిషేధిత ఉగ్రసంస్థ జైషే సంస్థ నాయకులతో పాక్‌ ప్రభుత్వం టచ్‌లోనే ఉందని ఆయన అంగీకరించారు. జైషే ఉగ్రవాద సంస్థ నాయకులను సంప్రదించామని, పుల్వామా ఉగ్రదాడికి తాము పాల్పడలేదని ఆ సంస్థ తమతో చెప్పినట్లు తెలిపారు.
 
భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై ఖురేషి స్పందిస్తూ.. పాకిస్థాన్ శాంతిని కోరుకుంటోందని చెప్పారు. 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్ల ప్రాణాలను బలిగొన్న పుల్వామా ఉగ్రదాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు జైషే సంస్థ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి భిన్నంగా ఖురేషి సమాధానం ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీత లేని ఇంటికి ఇప్పటివరకు వెళ్లలేదు : పార్తిబన్

Raj Tarun: ఏం బతుకురా నాది అంటున్న రాజ్ తరుణ్

ఇంటిల్లిపాదినీ నవ్వించే సారంగపాణి జాతకం సిద్ధం : నిర్మాత

Santosh Shobhan: సంతోష్ శోభన్ హీరోగా కపుల్ ఫ్రెండ్లీ షూటింగ్ కంప్లీట్

అల్లరి నరేష్ కొత్త సినిమా పేరు 12A రైల్వే కాలనీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments