Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉనికిలో లేని మంత్రిత్వ శాఖకు 20 నెలలుగా మంత్రి!!

ఠాగూర్
శనివారం, 22 ఫిబ్రవరి 2025 (15:38 IST)
పంజాబ్ రాష్ట్రంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఉనికిలో లేని మంత్రిత్వశాఖకు ఓ మంత్రి 20 నెలలుగా ఉన్నారు. దీన్ని సవరించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. దీనిపై విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ పాలన ఒక జోక్‌గా ఉందని పేర్కొంది. 
 
కాగా, గత 2022 మార్చి నెలలో పంజాబ్ రాష్ట్రంలో భగవంత్ మాన్ సింగ్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెల్సిందే. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 2023లో మే నెలలో కుల్దీప్ సింగ్ ధలివాల్‌కు రెండు శాఖలు కేటాయించారు. ఇందులో ఒకటి ప్రవాస భారతీయ వ్యవహరాల మంత్రిత్వ శాఖ కాగా రెండోది అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ డిపార్టుమెంట్. 2024 ఆఖరులో మరోమారు పనర్‌వ్యవస్థీకరణ జరిగింది. ఆ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. 
 
అయితే, దీనిని తాజాగా సవరించింది. కుల్దీప్‌కు కేటాయించిన కేటాయించిన శాఖను రద్దు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ఉనికిలో లేకపోవడం వల్ల సెప్టెంబరులో ఇచ్చిన నోటిఫికేషన్‌లో మార్పులు చేస్తున్నట్టు అందులో పేర్కొంది. కాగా, లేని శాఖకు కుల్దీప్ సింగ్ మంత్రిగా ఉన్న వ్యవహారంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. పంజాబ్‌లో పాలనకు ఆప్ పాలన ఒక జోక్‌గా మార్చివేసిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments