Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవరాత్రి ఉత్సవాలు.. అమ్మవారికి 22 కేజీల బంగారు చీర.. ఎక్కడ?

దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని వివిధ రూపాల్లో భక్తులు స్మరించుకుని పూజలు చేస్తున్నారు.

Webdunia
గురువారం, 11 అక్టోబరు 2018 (12:31 IST)
దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని వివిధ రూపాల్లో భక్తులు స్మరించుకుని పూజలు చేస్తున్నారు. తాజాగా దసరా వేడుకలు వైభవోపేతంగా జరిగే పశ్చిమబెంగాల్‌లో అమ్మవారి విగ్రహానికి 22 కేజీల బంగారంతో చీరను తయారు చేశారు. 
 
సాధారణంగా దసరా వచ్చిందంటే పశ్చిమబెంగాల్‌లో దుర్గామాత మండపాలను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం కోల్‌కతాలోని సంతోష్‌ మిత్రా స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన మండపం, అమ్మవారి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓవైపు లండన్‌ థీమ్‌తో మండపం ఏర్పాటు చేశారు. అలాగే అమ్మవారికి బంగారంతో తయారు చేసిన చీర అందరికీ ఆకట్టుకుంటోంది.
 
పూజా కమిటీ దుర్గామాత కోసం దాదాపు 22 కేజీల బంగారంతో చీరను తయారు చేయించింది. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ అగ్నిమిత్ర పౌల్‌ ఈ చీరను డిజైన్‌ చేశారు. దాదాపు 50 మంది నిపుణులు ఈ చీర తయారీలో పాలుపంచుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో చౌర్య పాఠం విడుదల చేస్తున్నాం : త్రినాథరావు నక్కిన

జూ.ఎన్టీఆర్ ధరించిన షర్టు ధర రూ.85 వేలా?

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా కిచ్చా సుదీప్ తో బిల్లా రంగ బాషా ప్రారంభం

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments