Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ దంపతులను కొట్టి.. వధువుపై గ్యాంగ్ రేప్

Webdunia
గురువారం, 11 అక్టోబరు 2018 (12:08 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్ళూరు జిల్లాలో దారుణం జరిగింది. నవ దంపతులపై నలుగురు వ్యక్తులు దాడి చేసి.. వధువుపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
తిరువళ్ళూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవలే వివాహమైంది. తన భార్యతో కలిసి కుమరన్ నాయికన్ పేటలోని దేవాలయానికి దైవదర్శనానికి వచ్చాడు. దైవ దర్శనం అనతరం నవదంపతులు ఇద్దరూ బైక్‌పై తిరిగి ఇంటికి వెళ్తుండగా.. నలుగురు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. మద్యం మత్తులో ఉన్న ఆ నలుగురు నవ దంపతులపై దాడి చేశారు. వరుడి చేతిపై కత్తితో దాడి చేశారు. 
 
దీంతో భయపడిన వరుడు.. భార్యను అక్కడే వదిలి గ్రామంలోకి పరుగులు తీశాడు. గ్రామంలోకి వెళ్లి ఎవరినైనా సహాయం తీసుకువద్దామనుకొని అతను పరుగులు తీయగా.. అదే అదునుగా భావించిన దుండగులు వధువుపై అత్యాచారానికి తెగబడ్డారు. గ్రామానికి ఒక కిలోమీటర్ దూరంలో ఈ దారుణం జరిగింది. 
 
వరుడి సమాచారంతో గ్రామస్థులు అక్కడికి చేరుకోగా.. ఆలోపే నలుగురు దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గాలించి పట్టుకున్నారు. నిందితులు మునుస్వామి(36), మోహన్(29), మరో ఇద్దరు మైనర్లుగా గుర్తించారు. నలుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

వీర ధీర శూర సినిమా బిగినింగ్ మిస్ కావొద్దు, ముందు సీక్వెల్ విడుదల: చియాన్ విక్రమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం