పెళ్లయిన స్త్రీతో ప్రేమ... రాలేదని ఛాతీపై బ్లేడుతో కోసుకున్నాడు... ఆపై...

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (10:13 IST)
ఈమధ్య పరస్పరం ఇష్టముండి సంబంధం కొనసాగించడం... అదే వివాహేతర సంబంధం అనేది నేరం కాకపోవడంతో పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమల్లో మునిగితేలేవారు ఎక్కువవుతున్నారు. ఇలాంటి ప్రేమల్లోనూ పలు దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఢిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. తను ప్రేమించిన పెళ్లయిన ప్రియురాలు తను పిలువగానే రాలేదన్న కోపంతో ఓ వ్యక్తి బ్లేడుతో కోసుకుని బీభత్సం సృష్టించాడు. అంతటితో ఆగకుండా ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే... ఢిల్లీలో సంగం విహారులోని కేబుల్ ఆఫీసులో లక్ష్మీనారాయణ పనిచేస్తున్నాడు. ఇతడికి పెళ్లై భార్య, ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. ఐతే ఆమెకు కొంతకాలంగా దూరంగా వుంటున్నాడు. ఈ క్రమంలో అక్కడే మరో వివాహితతో సన్నిహితంగా వుంటున్నాడు. ఇది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఆదివారం నాడు శెలవు దినం కావడంతో ఆమెను తన గదికి రావాలని ఫోన్ చేశాడు. 
 
ఆమె ఎంతకీ రాకపోవడంతో బ్లేడుతో తన గుండెపై కోసుకుని బీభత్సమైన ఫోటోలను ఆమెకు పంపాడు అలాగైనా వస్తుందని. కానీ ఆమె రాకపోవడంతో అప్పటికే పూటుగా మద్యం సేవించిన నారయణ ఆఫీసులో వుండే కేబుల్ వైర్లను తీసుకుని వాటితో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందటంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments