Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయిన స్త్రీతో ప్రేమ... రాలేదని ఛాతీపై బ్లేడుతో కోసుకున్నాడు... ఆపై...

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (10:13 IST)
ఈమధ్య పరస్పరం ఇష్టముండి సంబంధం కొనసాగించడం... అదే వివాహేతర సంబంధం అనేది నేరం కాకపోవడంతో పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమల్లో మునిగితేలేవారు ఎక్కువవుతున్నారు. ఇలాంటి ప్రేమల్లోనూ పలు దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఢిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. తను ప్రేమించిన పెళ్లయిన ప్రియురాలు తను పిలువగానే రాలేదన్న కోపంతో ఓ వ్యక్తి బ్లేడుతో కోసుకుని బీభత్సం సృష్టించాడు. అంతటితో ఆగకుండా ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే... ఢిల్లీలో సంగం విహారులోని కేబుల్ ఆఫీసులో లక్ష్మీనారాయణ పనిచేస్తున్నాడు. ఇతడికి పెళ్లై భార్య, ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. ఐతే ఆమెకు కొంతకాలంగా దూరంగా వుంటున్నాడు. ఈ క్రమంలో అక్కడే మరో వివాహితతో సన్నిహితంగా వుంటున్నాడు. ఇది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఆదివారం నాడు శెలవు దినం కావడంతో ఆమెను తన గదికి రావాలని ఫోన్ చేశాడు. 
 
ఆమె ఎంతకీ రాకపోవడంతో బ్లేడుతో తన గుండెపై కోసుకుని బీభత్సమైన ఫోటోలను ఆమెకు పంపాడు అలాగైనా వస్తుందని. కానీ ఆమె రాకపోవడంతో అప్పటికే పూటుగా మద్యం సేవించిన నారయణ ఆఫీసులో వుండే కేబుల్ వైర్లను తీసుకుని వాటితో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందటంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments