Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడి ప్రేయసిని నమ్మించి రేప్... రెండేళ్ల తర్వాత తీర్పు...

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (15:20 IST)
ఫ్రెండ్ లవర్‌ను నమ్మించి ఆమెపై అత్యాచారం చేసిన ఘటన తమిళనాడు కడలూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన రెండేళ్ల క్రితం జరిగింది. ఇందుకు సంబంధించిన విచారణ రెండేళ్ల పాటు సాగింది. నిందితుడికి కోర్టు 20 ఏళ్లపాటు జైలు శిక్షను ఖరారు చేసింది.
 
కడలూరులోని పెరియకోటమూలై ప్రాంతానికి చెందిన సత్యమూర్తి, విజయేంద్రన్ స్నేహితులు. అయితే విజయేంద్రన్ ప్రియురాలిపై సత్యమూర్తి ఎప్పటినుంచో కన్నేశాడు. అందుకు ఒక పథకాన్ని రచించాడు. 2017 మార్చి 17న సత్యమూర్తి యువతికి ఫోన్ చేసి విజయేంద్రన్‌కి యాక్సిడెంట్ అయిందని, కోయంబత్తూర్ హాస్పిటల్‌లో చేర్చినట్లు అలాగే అతడి కండీషన్ సీరియస్‌గా ఉందని చెప్పి ఆమెను బైక్‌పై తీసుకెళ్లాడు. అతని మాయమాటలు వినిన యువతి బైక్‌పై వెళ్లింది. 
 
నిర్మానుష్య ప్రాంతానికి యువతిని తీసుకెళ్లిన సత్యమూర్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడి నుండి తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన అప్పట్లో స్థానికంగా సంచలనం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. 
 
ఈ సంఘటనపై విచారణ జరిపిన కడలూరు విమెన్ కోర్టు నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితుడికి రెండేళ్ల తర్వాత శిక్షపడడంతో తగు న్యాయం జరిగిందంటూ పలువురు ఆనందం వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments