Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిలో జగన్ గృహప్రవేశం

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (15:13 IST)
ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం గృహ ప్రవేశం చేశారు. అమరావతికి సమీపంలో కొత్తగా నిర్మించుకున్న ఇంట్లోకి ఆయన సతీసమేతంగా ప్రవేశించారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారు. రాజధాని ప్రాంతంలో తమకంటూ సొంత ఇల్లు ఉంటే పార్టీ కార్యకలాపాలకు కూడా బాగుంటుందనే అభిప్రాయంతో ఈ ఇంటి నిర్మాణం చేపట్టారు. 
 
గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో నూతనంగా నిర్మించిన ఇంటికి బుధవారం ఉదయం జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతితో కలిసి సతీసమేతంగా గృహ ప్రవేశంచేశారు. ఈ సందర్భంగా నూతన గృహంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. 
 
ఈ కార్యక్రమంలో జగన్ తల్లి విజయమ్మ, షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, ఇంకా ఇతర కుటుంబ సభ్యులతో పాటు పార్టీ ముఖ్య నేతలైన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మిధున్ రెడ్డి, రోజా, పార్థ సారధి తదితరులు పాల్గొన్నారు.
 
గృహ ప్రవేశం అనంతరం ఆ పక్కనే నిర్మించిన వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments