అమరావతిలో జగన్ గృహప్రవేశం

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (15:13 IST)
ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం గృహ ప్రవేశం చేశారు. అమరావతికి సమీపంలో కొత్తగా నిర్మించుకున్న ఇంట్లోకి ఆయన సతీసమేతంగా ప్రవేశించారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారు. రాజధాని ప్రాంతంలో తమకంటూ సొంత ఇల్లు ఉంటే పార్టీ కార్యకలాపాలకు కూడా బాగుంటుందనే అభిప్రాయంతో ఈ ఇంటి నిర్మాణం చేపట్టారు. 
 
గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో నూతనంగా నిర్మించిన ఇంటికి బుధవారం ఉదయం జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతితో కలిసి సతీసమేతంగా గృహ ప్రవేశంచేశారు. ఈ సందర్భంగా నూతన గృహంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. 
 
ఈ కార్యక్రమంలో జగన్ తల్లి విజయమ్మ, షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, ఇంకా ఇతర కుటుంబ సభ్యులతో పాటు పార్టీ ముఖ్య నేతలైన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మిధున్ రెడ్డి, రోజా, పార్థ సారధి తదితరులు పాల్గొన్నారు.
 
గృహ ప్రవేశం అనంతరం ఆ పక్కనే నిర్మించిన వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments