Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిలో జగన్ గృహప్రవేశం

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (15:13 IST)
ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం గృహ ప్రవేశం చేశారు. అమరావతికి సమీపంలో కొత్తగా నిర్మించుకున్న ఇంట్లోకి ఆయన సతీసమేతంగా ప్రవేశించారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారు. రాజధాని ప్రాంతంలో తమకంటూ సొంత ఇల్లు ఉంటే పార్టీ కార్యకలాపాలకు కూడా బాగుంటుందనే అభిప్రాయంతో ఈ ఇంటి నిర్మాణం చేపట్టారు. 
 
గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో నూతనంగా నిర్మించిన ఇంటికి బుధవారం ఉదయం జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతితో కలిసి సతీసమేతంగా గృహ ప్రవేశంచేశారు. ఈ సందర్భంగా నూతన గృహంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. 
 
ఈ కార్యక్రమంలో జగన్ తల్లి విజయమ్మ, షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, ఇంకా ఇతర కుటుంబ సభ్యులతో పాటు పార్టీ ముఖ్య నేతలైన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మిధున్ రెడ్డి, రోజా, పార్థ సారధి తదితరులు పాల్గొన్నారు.
 
గృహ ప్రవేశం అనంతరం ఆ పక్కనే నిర్మించిన వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments