Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే 72 గంటలు అత్యంత కీలకం.. ఏమైనా జరగొచ్చు : పాకిస్థాన్

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (15:07 IST)
భారత వైమానిక దళం దాడులను పాకిస్థాన్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. ఈ దాడులకు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉంది. ఈనేపథ్యంలో సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఫలితంగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం తప్పదంటూ వార్తలు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ రైల్వే మంత్రి ఖాజా రఫీ అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే 72 గంటలు అత్యంత కీలకమన్నారు. ఈ సమయంలో ఏమైనా జరగొచ్చన్నారు. ఒకటి యుద్ధమా? లేదా శాంతి? అనేది 72 గంటల్లో తేలుతుందన్నారు. 
 
ఒకవేళ భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం వస్తే.. రెండో ప్రపంచ యుద్ధం కన్నా భీకరంగా ఉంటుందని ఈ పాక్ మంత్రి అన్నాడు. పైగా, భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధమంటూ జరిగితే ఇదే చివరి యుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. 
 
కాగా, మంగళవారం తెల్లవారుజామున 12 యుద్ధవిమానాలతో జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై వెయ్యి కేజీల ఆర్డీఎక్స్‌ను వేయడంతో.. క్షణాల్లో ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ మెరుపు దాడుల్లో 300 మంది పైగా జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో పాకిస్థాన్ ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2: బిగ్ బాస్ హౌస్‌లోకి రానున్న పుష్ప 2 కొరియోగ్రాఫర్.. ఎవరు?

Rashmika : విజయ్ దేవరకండ, రష్మిక పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

Nag Ashwin: కళ్యాణి ప్రియదర్శన్ నేనూ ఒకేలా వుంటాం, ఆలోచిస్తాము :దుల్కర్ సల్మాన్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

తర్వాతి కథనం
Show comments