Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే 72 గంటలు అత్యంత కీలకం.. ఏమైనా జరగొచ్చు : పాకిస్థాన్

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (15:07 IST)
భారత వైమానిక దళం దాడులను పాకిస్థాన్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. ఈ దాడులకు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉంది. ఈనేపథ్యంలో సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఫలితంగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం తప్పదంటూ వార్తలు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ రైల్వే మంత్రి ఖాజా రఫీ అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే 72 గంటలు అత్యంత కీలకమన్నారు. ఈ సమయంలో ఏమైనా జరగొచ్చన్నారు. ఒకటి యుద్ధమా? లేదా శాంతి? అనేది 72 గంటల్లో తేలుతుందన్నారు. 
 
ఒకవేళ భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం వస్తే.. రెండో ప్రపంచ యుద్ధం కన్నా భీకరంగా ఉంటుందని ఈ పాక్ మంత్రి అన్నాడు. పైగా, భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధమంటూ జరిగితే ఇదే చివరి యుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. 
 
కాగా, మంగళవారం తెల్లవారుజామున 12 యుద్ధవిమానాలతో జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై వెయ్యి కేజీల ఆర్డీఎక్స్‌ను వేయడంతో.. క్షణాల్లో ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ మెరుపు దాడుల్లో 300 మంది పైగా జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో పాకిస్థాన్ ఉంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments