Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకు క్లర్క్‌కు జాక్‌పాట్ : లాటరీ టిక్కెట్ కొన్న గంటకే రూ.కోటి

Webdunia
సోమవారం, 17 జులై 2023 (16:35 IST)
చాలా మంది ఏమాత్రం కష్టపడకుండానే డబ్బులు సంపాదించాలన్న ఆశ ఉంటుంది. ఇలాంటి వారు తమ చేతిలో డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తుంటారు. అలా ఓ లాటరీ టిక్కెట్ కొనుగోలు చేసిన ఓ వ్యక్తి ఓ గంటలోనే కోటీశ్వరుడయ్యాడు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. 
 
పంజాప్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ జిల్లాకు చెందిన రూపీందర్ జిత్ సింగ్ ఓ గ్రామీణ వ్యవసాయ బ్యాంకులో క్లర్క్‌గా పని చేస్తున్నాడుు. ఈయన గత యేడాది కాలంగా లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. 
 
ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఎప్పటిలాగే రూపీందర్ జిత్ సింగ్‌ నాగాలాండ్ బంపర్ లాటరీ టిక్కెట్లు ఒక్కోటి రూ.6 చొప్పున 25 టిక్కెట్లను కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆయన ఎప్పటిలానే బ్యాంకుకు వెళ్లి తన విధుల్లో నిమగ్నమయ్యాడు. 
 
ఓ గంట తర్వాత ఆయనకు లాటరీ ఏజెంట్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన ఏకంగా రూ.కోటి గెలుచుకున్నట్టు ఏజెంట్ చెప్పాడు. దీంతో, రూపీందర్ సంబరం అంబరాన్నంటింది. ఈ డబ్బును తన పిల్లలు, కుటుంబం భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తానని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments