బ్యాంకు క్లర్క్‌కు జాక్‌పాట్ : లాటరీ టిక్కెట్ కొన్న గంటకే రూ.కోటి

Webdunia
సోమవారం, 17 జులై 2023 (16:35 IST)
చాలా మంది ఏమాత్రం కష్టపడకుండానే డబ్బులు సంపాదించాలన్న ఆశ ఉంటుంది. ఇలాంటి వారు తమ చేతిలో డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తుంటారు. అలా ఓ లాటరీ టిక్కెట్ కొనుగోలు చేసిన ఓ వ్యక్తి ఓ గంటలోనే కోటీశ్వరుడయ్యాడు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. 
 
పంజాప్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ జిల్లాకు చెందిన రూపీందర్ జిత్ సింగ్ ఓ గ్రామీణ వ్యవసాయ బ్యాంకులో క్లర్క్‌గా పని చేస్తున్నాడుు. ఈయన గత యేడాది కాలంగా లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. 
 
ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఎప్పటిలాగే రూపీందర్ జిత్ సింగ్‌ నాగాలాండ్ బంపర్ లాటరీ టిక్కెట్లు ఒక్కోటి రూ.6 చొప్పున 25 టిక్కెట్లను కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆయన ఎప్పటిలానే బ్యాంకుకు వెళ్లి తన విధుల్లో నిమగ్నమయ్యాడు. 
 
ఓ గంట తర్వాత ఆయనకు లాటరీ ఏజెంట్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన ఏకంగా రూ.కోటి గెలుచుకున్నట్టు ఏజెంట్ చెప్పాడు. దీంతో, రూపీందర్ సంబరం అంబరాన్నంటింది. ఈ డబ్బును తన పిల్లలు, కుటుంబం భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తానని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments