Webdunia - Bharat's app for daily news and videos

Install App

వడదెబ్బ.. మహారాష్ట్రలో గర్భిణీ మృతి..ఏడు కిలోమీటర్లు నడిచే వెళ్తే..?

Webdunia
బుధవారం, 17 మే 2023 (11:34 IST)
భారత్‌లో వేసవి తాపం విజృంభిస్తున్న వేళ.. వడదెబ్బకు గురై ఓ గర్భిణి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మహారాష్ట్రలో పాల్ఘర్ జిల్లాకు చెందిన సోనాలి (19) ఓసర్ వీర గిరిజన గ్రామానికి చెందినది. ఈమె 9 నెలల గర్భిణిగా ఉంది. అయితే వేడిమి కారణంగా అస్వస్థతకు గురైంది. ఆ తర్వాత ఎండలో 7 కిలోమీటర్లు నడిచి ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం. దీంతో ఆమె వడదెబ్బకు గురైనట్లు తెలుస్తోంది. 
 
ఆపై దావా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య వైద్య సిబ్బంది ఆమెను పరీక్షించి గజల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించాలని సూచించారు. మహిళ కుటుంబీకులు వెంటనే ఆమెను అంబులెన్స్‌లో గాజా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గమధ్యంలోనే ఆ గర్భిణీ మహిళ మృతి చెందింది. ఆమె గర్భస్థ శిశువు కూడా ప్రాణాలు కోల్పోయింది. ఎండలో 7 కిలోమీటర్లు నడిచి వెళ్లడంతోనే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments