Webdunia - Bharat's app for daily news and videos

Install App

వడదెబ్బ.. మహారాష్ట్రలో గర్భిణీ మృతి..ఏడు కిలోమీటర్లు నడిచే వెళ్తే..?

Webdunia
బుధవారం, 17 మే 2023 (11:34 IST)
భారత్‌లో వేసవి తాపం విజృంభిస్తున్న వేళ.. వడదెబ్బకు గురై ఓ గర్భిణి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మహారాష్ట్రలో పాల్ఘర్ జిల్లాకు చెందిన సోనాలి (19) ఓసర్ వీర గిరిజన గ్రామానికి చెందినది. ఈమె 9 నెలల గర్భిణిగా ఉంది. అయితే వేడిమి కారణంగా అస్వస్థతకు గురైంది. ఆ తర్వాత ఎండలో 7 కిలోమీటర్లు నడిచి ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం. దీంతో ఆమె వడదెబ్బకు గురైనట్లు తెలుస్తోంది. 
 
ఆపై దావా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య వైద్య సిబ్బంది ఆమెను పరీక్షించి గజల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించాలని సూచించారు. మహిళ కుటుంబీకులు వెంటనే ఆమెను అంబులెన్స్‌లో గాజా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గమధ్యంలోనే ఆ గర్భిణీ మహిళ మృతి చెందింది. ఆమె గర్భస్థ శిశువు కూడా ప్రాణాలు కోల్పోయింది. ఎండలో 7 కిలోమీటర్లు నడిచి వెళ్లడంతోనే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments