Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు కార్మికుల మృతి

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (10:14 IST)
జార్ఖండ్‌లో‌ చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు కూలీలు ప్రాణాలు కోల్పోగా, 18 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..  జార్ఖండ్ పాలం జిల్లాలోని హరిహరగంజ్‌లో పికప్ వ్యాన్, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాద ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఆరుగురు కూలీలు మృతి చెందారు. 
 
ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారని, మరో ముగ్గురు మహిళలు చికిత్స పొందుతూ మరణించారని ప్రమాద స్థలానికి చేరుకున్న హరిహరగంజ్ బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ జైప్రకాష్ నారాయణ్ తెలిపారు. హరిహరగంజ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో 12 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారని హరిహర్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సుదామ కుమార్ దాస్ తెలిపారు. 
 
పాలం జిల్లాలోని పంకికి చెందిన కార్మికులు పొరుగున ఉన్న బీహార్‌లోని సిహుడి గ్రామంలో వరి కోత తర్వాత తమ గ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments