Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (07:33 IST)
నేపాల్‌ను భారీ భూకంపం వణికించింది. ఇది భూకంప లేఖినిపై 6.3గా నమోదైంది. ఈ భూప్రకంపనలు భారతదేశ రాజధాని ఢిల్లీలో కూడా కనిపించాయి. అర్థరాత్రి 1.57 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. భూమికి పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు నేపాల్ జాతీయ భూకంప కేంద్రం (సిస్మోలజీ సెంటర్) తెలిపింది. కేవలం రెండు గంటల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ భూకంపం కారణంగా ఓ ఇల్లు కూలి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఇంకా ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సివుంది. 
 
కాగా, ఇటీవలి కాలంలో నేపాల్‌లో తరచుగా వరుస భూకంపాలు వస్తున్నాయి. అక్టోబరు 19 ఖాట్మంటులో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అలాగే, జూలై 31వ తేదీన 6.0 తీవ్రతో భూకంపం వచ్చింది. గత 2015లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి దాదాపు 9 వేల మంది ప్రాణాలు కోల్పోగా, 22 వేల మంది గాయపడిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments