Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళను మింగేసిన కొండ చిలువ.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (10:43 IST)
ఇండోనేషియాలో ఓ విషాదకరఘటన జరిగింది. 54 యేళ్ల మహిళను 24 అడుగులు పొడవుండే కొండచిలువ ఒకటి మింగేసింది. అటవీ ప్రాంతంలోని రబ్బరు ఏరేందుకు వెళ్లిన ఆ మహిళ అనూహ్యంగా కొండచిలువ చేతిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇండోనేషియాలోని జాంబీ ప్రాంతంలోని అటవీ ప్రాంతానికి ఓ 54 యేళ్ల మహిళ రబ్బరు ఏరేందుకు వెళ్లింది. ఆమె రెండు రోజులైన తిరిగి రాకపోవడంతో అనుమానించిన భర్త.. ఆమెను వెతుక్కుంటూ అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఆమె చెప్పులు. జాకెట్, హెడ్‌స్కార్ఫ్, కత్తి వంటివి కనిపించాయి. దీంతో ఆయన అధికారులకు సమాచారం అందించారు. 
 
ఆ వెంటనే రంగంలోకి దిగిన అటవీ అధికారులు అడవిని జల్లెడపట్టగా ఓ కొండ చిలువ కనిపించింది. దాని పొట్ట ఉబ్బెత్తుగా ఉండటంతో వారికి అనుమానం వచ్చింది. ఆ మహిళను కొండచిలువ మింగేసి ఉంటుందని భావించారు. ఆ తర్వాత గ్రామస్థులతో కలిసి దానిని చంపి పొట్టను చీల్చారు. అందులో మహిళ కళేభరాన్ని వెలికి తీశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments