Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొసలి అంత్యక్రియలకు ఊరంతా తరలి వచ్చింది...

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (10:35 IST)
ఎవరైనా చీటికిమాటికి ఏడుస్తుంటే మొసలి కన్నీరు పెట్టకు అని అంటుంటారు. కానీ, నిజంగానే ఒక మొసలి చనిపోవడంతో ఆ ఊరు ఊరంతా కన్నీరు కార్చింది. తమ గ్రామ ప్రజలు దైవంగా భావించే మొసలి చనిపోవడంతో గ్రామంలోని 500 మంది ప్రజలు ఒక రోజంతా భోజనం చేయలేదు. అంతేనా, ఈ మొసలి అంత్యక్రియల కోసం గ్రామమంతా తరలి వచ్చింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఓసారి తెలుసుకుందాం. 
 
ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతారా జిల్లాలో బవామొహ్ తారా గ్రామంలో పెద్ద చెరువు ఒకటి ఉంది. ఈ చెరువులో వందేళ్లకుగాపైగా ఓ మొసలి జీవిస్తూ వచ్చింది. దీంతో ఆ మొసలిని ఆ గ్రామ ప్రజలంతా తమ గ్రామ దైవంగా భావించి పూజిస్తూ వచ్చారు. పైగా, ఈ మొసలికి గంగారాం అనే పేరు కూడా పెట్టుకున్నారు. ఈ మొసలి ఇటీవల చనిపోయింది. 
 
ఆ తర్వాత అటవీ అధికారులకు సమాచారం చేరవేశారు. వీరితో పాటు గ్రామస్థులంతా చనిపోయిన మొసలిని వెలికి తీసి, భక్తితో తాకి, తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. ఈ మొసలి 3.4 మీటర్ల పొడవు, 250 కేజీల బరువు ఉన్నట్టు వెల్లడించారు. అంతేకాకుండా, చెరువు ఒడ్డున స్మారక స్థూపం ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్లు గ్రామ సర్పంచ్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments