Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొసలి అంత్యక్రియలకు ఊరంతా తరలి వచ్చింది...

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (10:35 IST)
ఎవరైనా చీటికిమాటికి ఏడుస్తుంటే మొసలి కన్నీరు పెట్టకు అని అంటుంటారు. కానీ, నిజంగానే ఒక మొసలి చనిపోవడంతో ఆ ఊరు ఊరంతా కన్నీరు కార్చింది. తమ గ్రామ ప్రజలు దైవంగా భావించే మొసలి చనిపోవడంతో గ్రామంలోని 500 మంది ప్రజలు ఒక రోజంతా భోజనం చేయలేదు. అంతేనా, ఈ మొసలి అంత్యక్రియల కోసం గ్రామమంతా తరలి వచ్చింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఓసారి తెలుసుకుందాం. 
 
ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతారా జిల్లాలో బవామొహ్ తారా గ్రామంలో పెద్ద చెరువు ఒకటి ఉంది. ఈ చెరువులో వందేళ్లకుగాపైగా ఓ మొసలి జీవిస్తూ వచ్చింది. దీంతో ఆ మొసలిని ఆ గ్రామ ప్రజలంతా తమ గ్రామ దైవంగా భావించి పూజిస్తూ వచ్చారు. పైగా, ఈ మొసలికి గంగారాం అనే పేరు కూడా పెట్టుకున్నారు. ఈ మొసలి ఇటీవల చనిపోయింది. 
 
ఆ తర్వాత అటవీ అధికారులకు సమాచారం చేరవేశారు. వీరితో పాటు గ్రామస్థులంతా చనిపోయిన మొసలిని వెలికి తీసి, భక్తితో తాకి, తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. ఈ మొసలి 3.4 మీటర్ల పొడవు, 250 కేజీల బరువు ఉన్నట్టు వెల్లడించారు. అంతేకాకుండా, చెరువు ఒడ్డున స్మారక స్థూపం ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్లు గ్రామ సర్పంచ్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

Charan: పెద్ది ఫర్ ప్రదీప్ అని రామ్ చరణ్ చెప్పడం చాలా హ్యాపీ : ప్రదీప్ మాచిరాజు

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments