Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొసలి అంత్యక్రియలకు ఊరంతా తరలి వచ్చింది...

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (10:35 IST)
ఎవరైనా చీటికిమాటికి ఏడుస్తుంటే మొసలి కన్నీరు పెట్టకు అని అంటుంటారు. కానీ, నిజంగానే ఒక మొసలి చనిపోవడంతో ఆ ఊరు ఊరంతా కన్నీరు కార్చింది. తమ గ్రామ ప్రజలు దైవంగా భావించే మొసలి చనిపోవడంతో గ్రామంలోని 500 మంది ప్రజలు ఒక రోజంతా భోజనం చేయలేదు. అంతేనా, ఈ మొసలి అంత్యక్రియల కోసం గ్రామమంతా తరలి వచ్చింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఓసారి తెలుసుకుందాం. 
 
ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతారా జిల్లాలో బవామొహ్ తారా గ్రామంలో పెద్ద చెరువు ఒకటి ఉంది. ఈ చెరువులో వందేళ్లకుగాపైగా ఓ మొసలి జీవిస్తూ వచ్చింది. దీంతో ఆ మొసలిని ఆ గ్రామ ప్రజలంతా తమ గ్రామ దైవంగా భావించి పూజిస్తూ వచ్చారు. పైగా, ఈ మొసలికి గంగారాం అనే పేరు కూడా పెట్టుకున్నారు. ఈ మొసలి ఇటీవల చనిపోయింది. 
 
ఆ తర్వాత అటవీ అధికారులకు సమాచారం చేరవేశారు. వీరితో పాటు గ్రామస్థులంతా చనిపోయిన మొసలిని వెలికి తీసి, భక్తితో తాకి, తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. ఈ మొసలి 3.4 మీటర్ల పొడవు, 250 కేజీల బరువు ఉన్నట్టు వెల్లడించారు. అంతేకాకుండా, చెరువు ఒడ్డున స్మారక స్థూపం ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్లు గ్రామ సర్పంచ్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments