Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీం కోర్టులో కరోనా కలకలం.. 50శాతం సిబ్బందికి పాజిటివ్

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (10:52 IST)
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కరోనా కలకలం రేపింది. సుప్రీంకోర్టులోని 50 శాతం మంది సిబ్బంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఇక నుంచి కేసులను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇంటి నుంచే నిర్వహించాలని న్యాయమూర్తులు నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం కోర్టురూమ్‌లతోపాటు సుప్రీంకోర్టు ఆవరణ మొత్తాన్నీ శానిటైజ్ చేస్తున్నారు. కోర్టులోని అన్ని బెంచీలు ఒక గంట ఆలస్యంగా విచారణలు మొదలుపెట్టనున్నాయి.
 
సుప్రీంకోర్టులో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు సోమవారం కరోనా పాజిటివ్ అని తేలింది. సుప్రీంకోర్టు జడ్జీల కార్యాలయాలు, కోర్టు రిజిస్ట్రీల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు కరోనా అని తాజాగా జరిపిన పరీక్షల్లో వెల్లడైంది. 
 
కరోనా కలకలంతో సుప్రీంకోర్టులో కేసులను జడ్జీలు వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారిస్తున్నారు. సుప్రీంకోర్టులో పనిచేస్తున్న పలువురు కోర్టు ఉద్యోగులు కరోనా బారిన పడటంతో జడ్జీలు, న్యాయవాదులు, కక్షిదారులు ఆందోళన చెందుతున్నారు.
 
ఇండియాలో కరోనా రెండో దశ ఉద్ధృతంగా ఉంది. గత వారం రోజుల్లోనే కొత్తగా పది లక్షల కేసులు నమోదయ్యాయి. ఆదివారమే లక్షన్నరకు పైగా కేసులు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ కేసుల్లో ప్రపంచంలోనే అత్యధికంగా ఇండియాలోనే నమోదవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments