Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో ఓవైసీకి బిగ్ షాక్ : ఆర్జేడీలో చేరిన ఎంఐఎం ఎమ్మెల్యేలు

Webdunia
గురువారం, 30 జూన్ 2022 (11:48 IST)
బీహార్ రాష్ట్రంలో ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు శాసనసభ్యులు ఆర్జేడీ తీర్థం పుచ్చుకున్నారు. 
 
బీహార్ రాష్ట్ర అసెంబ్లీలో ఎంఐఎంకు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో ఒక్కరు మినహా మిగిలిన నలుగురు ఆర్జేడీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామంతో 243 మంది సభ్యులు గల రాష్ట్ర అసెంబ్లీలో ఆర్జేడీ బలం 80కు చేరింది. భాజపా కంటే మూడు స్థానాలు ఎక్కువ కావడంతో లాలూ పార్టీ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 
 
అయితే, ఎన్డీయే పాలన సాగుతున్న రాష్ట్రంలో లౌకిక శక్తులను బలోపేతం చేసే చర్యగా ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్‌ దీన్ని అభివర్ణించారు. 2020లో బీహార్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఐదు స్థానాల్లో విజయంతో మజ్లిస్‌ పార్టీ సంచలనం సృష్టించింది. వీరిలో సయ్యద్‌ రుక్నుద్దీన్‌ అహ్మద్‌ (బాయీసీ), షానవాజ్‌ ఆలం (జోకీహాట్‌), మహ్మద్‌ ఇజార్‌ అస్ఫి (కోచాధామన్‌), మహ్మద్‌ అంజార్‌ నయీమీ (బహదూర్‌గంజ్‌) ఆర్జేడీలో చేరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments