Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనకాపల్లి జిల్లాలో రాయల్ బెంగాల్ టైగర్ సంచారం

Webdunia
గురువారం, 30 జూన్ 2022 (11:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలో రాయల్ బెగాల్ టైగర్ సంచరిస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. పైగా, టైగర్ ఒక గేదెను కూడా చంపి ఆరగించినట్టు వారు ఆధారాలు చూపిస్తున్నారు. పైగా, కోటవురట్ల మండలం, టి.జగ్గంపేట సమీపంలోని జీడిమామిడి తోటలో దాని పాదముద్రలను గుర్తించారు. 
 
అలాగే, శ్రీరాంపురం సమీపంలోని జీడితోటలో గేదెను కూడా అది చంపి తిన్నట్టు స్థానికులతో పాటు అధికారులు కూడా గుర్తిచారు. పైగా, దాని పాదముద్రలను నిశితంగా పరిశీలించిన అటవీశాఖ అధికారులు ఈ టైగర్ రాయల్ బెంగాల్ టైగర్‌గా గుర్తించారు.
 
అయితే, గేదెను చంపి ఆరగించిన తర్వాత ఈ టైగర్ సమీపంలోని కొండపైకి వెళ్లిపోయింది. పైగా, ఇది మళ్లీ తిరిగి వచ్చే అవకాశం ఉండటంతో స్థానికులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. 
 
దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చారు. గేదెను చంపిన ప్రాంతానికి 30 కిలోమీటర్ల రేడియల్ ప్రాంతంలో ఈ పులి సంచరించే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల వాసులను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments