Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనకాపల్లి జిల్లాలో రాయల్ బెంగాల్ టైగర్ సంచారం

Webdunia
గురువారం, 30 జూన్ 2022 (11:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలో రాయల్ బెగాల్ టైగర్ సంచరిస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. పైగా, టైగర్ ఒక గేదెను కూడా చంపి ఆరగించినట్టు వారు ఆధారాలు చూపిస్తున్నారు. పైగా, కోటవురట్ల మండలం, టి.జగ్గంపేట సమీపంలోని జీడిమామిడి తోటలో దాని పాదముద్రలను గుర్తించారు. 
 
అలాగే, శ్రీరాంపురం సమీపంలోని జీడితోటలో గేదెను కూడా అది చంపి తిన్నట్టు స్థానికులతో పాటు అధికారులు కూడా గుర్తిచారు. పైగా, దాని పాదముద్రలను నిశితంగా పరిశీలించిన అటవీశాఖ అధికారులు ఈ టైగర్ రాయల్ బెంగాల్ టైగర్‌గా గుర్తించారు.
 
అయితే, గేదెను చంపి ఆరగించిన తర్వాత ఈ టైగర్ సమీపంలోని కొండపైకి వెళ్లిపోయింది. పైగా, ఇది మళ్లీ తిరిగి వచ్చే అవకాశం ఉండటంతో స్థానికులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. 
 
దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చారు. గేదెను చంపిన ప్రాంతానికి 30 కిలోమీటర్ల రేడియల్ ప్రాంతంలో ఈ పులి సంచరించే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల వాసులను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

Rajeev Kanakala: రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ.. ఆరోగ్యం బాగోలేదు

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments