Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో ఆ సిరప్ తాగి ముగ్గురు చిన్నారుల మృతి.. కోటి కావాలని డిమాండ్

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (18:30 IST)
ఢిల్లీ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. సిరప్ తాగిన పాపానికి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముగ్గురు వైద్యుల సేవలను రద్దు చేసి, ఈ విషయంపై విచారణకు ఆదేశించింది.  కానీ ఈ ఘటనపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ రాజీనామా చేయాలని, ముగ్గురు పిల్లల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని బీజేపీ, కాంగ్రెస్ డిమాండ్ చేశాయి. 
 
వివరాల్లోకి వెళితే.. కేంద్రం ఆధ్వర్యంలో నడిచే కళావతి శరణ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో ఇచ్చిన డ్రగ్స్‌ వల్ల ముగ్గురు చిన్నారులు చనిపోయారు. విషయం తెలిసిన వెంటనే ముగ్గురు వైద్యుల సేవలను రద్దు చేసి విచారణకు ఆదేశించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. 
 
ఢిల్లీ ప్రభుత్వం కూడా సోమవారం నలుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ (ఆగ్నేయ ఢిల్లీ) డాక్టర్ గీత ప్యానెల్‌కు నాయకత్వం వహిస్తారు. ఇది ఏడు రోజుల్లో నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
 
డెక్స్ట్రోమెథోర్ఫాన్ అనేది దగ్గును అణిచివేసే మందులలో ఒకటి. ఈ మందును సేవించిన ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన ముగ్గురు పిల్లల కుటుంబాలకు రూ. 1 కోటి పరిహారం, మరో 13 మంది పిల్లలకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments