Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైపూర్‌లో తొంగిచూసిన జికా వైరస్.. 29 కేసులు నమోదు..

జైపూర్‌లో జికా వైరస్ తొంగిచూసింది. రాజస్థాన్ రాజధాని అయిన జైపూర్‌లో 29 జికా పాజిటివ్ కేసులు నమోదైనాయి. వీటిపై సమగ్ర నివేదికను ప్రభుత్వం కోరింది.

Webdunia
మంగళవారం, 9 అక్టోబరు 2018 (14:40 IST)
జైపూర్‌లో జికా వైరస్ తొంగిచూసింది. రాజస్థాన్ రాజధాని అయిన జైపూర్‌లో 29 జికా పాజిటివ్ కేసులు నమోదైనాయి. వీటిపై సమగ్ర నివేదికను ప్రభుత్వం కోరింది. రాజస్థాన్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న జికా బాధితుల్లో ఒకరు బీహార్‌లోని సివన్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.


జైపూర్‌లో చదివే ఇతను ఆగస్టు 28న స్వగ్రామం సివన్‌కి వచ్చాడు. సెప్టెంబర్ 12వరకు అతను అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి తిరిగొచ్చాక అతనిలో జికా లక్షలు బయటపడ్డాయి. దీంతో అతని కుటుంబ సభ్యులను కూడా ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
 
ఇకపోతే.. బీహార్‌లోని 38 జిల్లాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రాజస్తాన్‌లో ఇప్పటికే ఏర్పాటైన కంట్రోల్ రూమ్ ద్వారా అక్కడి పరిస్థితిని ఏడుగురు ఉన్నత స్థాయి అధికారులతో కూడిన టీమ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. 
 
ఇప్పటివరకు రాష్ట్రంలో 22 జికా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. జికాగా అనుమానిస్తున్న కేసులను, ఆయా ప్రాంతాల్లోని దోమల శాంపిల్స్‌ను పరీక్షలకు పంపామని.. ఆ ప్రాంతాల్లో గర్భిణీ మహిళలకు ఈ వైరస్ సోకకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వాధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments