Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.925 కోట్ల దోపిడీని అడ్డుకున్న కానిస్టేబుల్... ఎలా?

ఓ కానిస్టేబుల్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఏకంగా రూ.925 కోట్ల దోపిడీని అడ్డుకున్నాడు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లో జరిగింది.

Advertiesment
Jaipur
, బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (14:59 IST)
ఓ కానిస్టేబుల్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఏకంగా రూ.925 కోట్ల దోపిడీని అడ్డుకున్నాడు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, జైపూర్ నగరంలో సి.స్కీమ్ ప్రాంతంలోని ఓ స్థానిక బ్యాంకులో దోపిడీ చేసేందుకు 13 మంది దోపిడీ దొంగలు సోమవారం అర్థరాత్రి వచ్చారు. అపుడు సమయం సరిగ్గా అర్థరాత్రి 2.30 గంటలు. 
 
బ్యాంకు ప్రధాన ద్వారం షట్టర్‌ను తొలగించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేయగా, కాపలా విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సీతారామ్ వెంటనే కాల్పులు జరుపుతూ అలారమ్ ఆన్ చేశాడు. దాంతో వచ్చిన దుండగులు వాహనంలో పారిపోయారు. 
 
పెద్ద శబ్దంతో అలారం మోగడంతో ఆ ప్రాంతానికి స్థానికులతో పాటు పోలీసులు కూడా నిమిషాల్లో చేరుకున్నారు. ఆ తర్వాత పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను తీసుకుని పరిశీలిస్తున్నారు. ఈ బ్యాంకు నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని శాఖలకు నగదును పంపే కేంద్రంగా పనిచేస్తుండటం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉరిశిక్షపై తీర్పు ఇచ్చాక పెన్నుపాళీని ఎందుకు విరిచేస్తారు?