Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి షాక్ : కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎంపీ

Webdunia
ఆదివారం, 3 మార్చి 2019 (12:57 IST)
ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో అధికార బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. బీజేపీ ఎంపీ సావిత్రి బాయి పూలే కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆమె గతంలోనే కమలం పార్టీకి రాజీనామా చేశారు. అలాగే, కాషాయం పార్టీపై చాలా సార్లు బహిరంగ విమర్శలు  కూడా చేశారు. 
 
ఆమెతో పాటు సమాజ్‌వాదీ పార్టీ నేత రాకేశ్‌ కూడా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, జ్యోతిరాధిత్య సింధియా సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. గతేడాది బీఆర్‌ అంబేద్కర్‌ వర్థంతి సందర్భంగా బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 
 
బీఎస్పీ అధినేత్రి మాయావతితో కూడా ఆమెకు సాన్నిహిత్యం ఉంది. 2000 సంవత్సరంలో బీజేపీలో చేరిన‌ పూలే 2002, 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఆమె 2014 సాధారణ ఎన్నికల్లో బహ్రైచ్‌ నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్‌సభకు ఎంపికయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments