Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమవారం నలుగురు.. మంగళవారం 18 మంది.. ఎంపీ సస్పెన్షన్

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (16:18 IST)
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ దఫా వాడివేడిగా సాగుతున్నాయి. ఈ సమావేశాల్లో జీఎస్టీ పన్ను పెంపుదలపై విపక్ష పార్టీలు భారీ స్థాయిలో ఆందోళనకు దిగుతున్నాయి. అదేసమయంలో ఇరు సభల స్పీకర్లు కూడా కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఇందులోభాగంగా, సోమవారరం సభా కార్యక్రమాలకు అడ్డు తగిలినందుకు నలుగురు కాంగ్రెస్ ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆదేశాలు జారీచేశారు.
 
మంగళవారం జీఎస్టీ పన్నును తగ్గించాలని కోరుతూ రాజ్యసభలో ఆందోళనకు దిగిన 18 మంది విపక్ష సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం తెల్సిందే.
 
అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ విధానాలు, జీఎస్టీ పన్ను పెంపు తదితర ప్రజా సమస్యలపై విపక్షాలు వాయిదా తీర్మాన నోటీసులను ఇస్తూ వస్తున్నాయి. కానీ, వీటిలో ఏ ఒక్కదానిపై చర్చించేందుకు ఇరు సభల స్పీకర్లు అనుమతించడం లేదు. దీంతో విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగుతూ సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. మొదటివారమంతా ఇదే పరిస్థితి నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో రెండో వారం తొలిరోజైన సోమవారం లోక్‌సభలో ఆందోళనకు దిగిన నలుగురు కాంగ్రెస్ ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేశారు. వీరిని వర్షాకాల సమావేశాలు ముగిసేవరకు సభలో సస్పెండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం రాజ్యసభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వీరిలో 18 మందిని సభ నుంచి సస్పెండ్ చేశారు. గత రెండు రోజుల్లో సస్పెండ్ చేసిన 22 మంది ఎంపీల్లో తమిళనాడుకు చెందిన ఎనిమిది మంది ఎంపీలు ఉండటం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments