Webdunia - Bharat's app for daily news and videos

Install App

మౌని అమావాస్య- ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాట.. 15మంది మృతి

సెల్వి
బుధవారం, 29 జనవరి 2025 (09:12 IST)
Stampede
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 15 మంది భక్తులు మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించడానికి వేలాది మంది యాత్రికులు సంగం వద్ద గుమిగూడిన సమయంలో ఈ సంఘటన జరిగింది. జనరద్దీ విపరీతంగా ఉండటంతో బారికేడ్లు కూలిపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మరికొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. 
 
బాధితుల్లో అనేక మంది మహిళలు ఉన్నారు. అత్యవసర సహాయక చర్యలు శరవేగంగా జరుగుతున్నాయి. సంఘటన జరిగిన కొద్దిసేపటికే దాదాపు 70 అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. కుంభమేళాకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అంతకుముందు రోజు మాత్రమే, గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం వద్ద దాదాపు 55 మిలియన్ల మంది యాత్రికులు స్నానమాచరించారు.
 
ఈ సంఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంకా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నుండి వివరాలు కోరారు. ఈ విషాదం నేపథ్యంలో, మౌని అమావాస్య అమృత స్నానాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. అఖిల భారతీయ అఖార పరిషత్ అధ్యక్షుడు రవీంద్ర పూరి మాట్లాడుతూ, సంగమం వద్ద భారీ సంఖ్యలో జనసమూహం ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments