Webdunia - Bharat's app for daily news and videos

Install App

మౌని అమావాస్య- ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాట.. 15మంది మృతి

సెల్వి
బుధవారం, 29 జనవరి 2025 (09:12 IST)
Stampede
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 15 మంది భక్తులు మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించడానికి వేలాది మంది యాత్రికులు సంగం వద్ద గుమిగూడిన సమయంలో ఈ సంఘటన జరిగింది. జనరద్దీ విపరీతంగా ఉండటంతో బారికేడ్లు కూలిపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మరికొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. 
 
బాధితుల్లో అనేక మంది మహిళలు ఉన్నారు. అత్యవసర సహాయక చర్యలు శరవేగంగా జరుగుతున్నాయి. సంఘటన జరిగిన కొద్దిసేపటికే దాదాపు 70 అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. కుంభమేళాకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అంతకుముందు రోజు మాత్రమే, గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం వద్ద దాదాపు 55 మిలియన్ల మంది యాత్రికులు స్నానమాచరించారు.
 
ఈ సంఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంకా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నుండి వివరాలు కోరారు. ఈ విషాదం నేపథ్యంలో, మౌని అమావాస్య అమృత స్నానాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. అఖిల భారతీయ అఖార పరిషత్ అధ్యక్షుడు రవీంద్ర పూరి మాట్లాడుతూ, సంగమం వద్ద భారీ సంఖ్యలో జనసమూహం ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇక్కడ ఫస్ట్ షూటింగ్ చేసేది నా సినిమానే: మెగాస్టార్ చిరంజీవి

ఫాదర్స్‌ సూసైడ్‌ స్టోరీతో బాపు సినిమా : బ్రహ్మాజీ

పవన్ కల్యాణ్ పెద్ద స్థాయికి వెళతారని పంజా టైమ్‌లోనే అర్థమైంది : డైరెక్టర్ విష్ణు వర్ధన్

కొత్తదనం కావాలనుకునే వారు తల సినిమా ఆనందంగా చూడవచ్చు : అమ్మరాజశేఖర్

రాజా మార్కండేయ ట్రైలర్ లో మంచి కంటెంట్ వుంది : సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ పర్యటన: తాజా ఫ్యాషన్ ప్రపంచంలోకి ద వన్ అండ్ వోన్లీ

ఆఫ్రికా హృదయం నుండి ఆయుర్వేద జ్ఞానం వరకు: మరువా x సరితా హండా

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments