Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ ఘజియాబాద్ జైలులో 140 మంది హెచ్ఐవీ రోగులు

Webdunia
శనివారం, 19 నవంబరు 2022 (11:56 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జైలులో 140 మందికి హెచ్.ఐ.వి. వైరస్ సోకిందని జైలు ఉన్నతాధికారులు తెలిపారు. గత 2016లో ఈ జైలుకు వచ్చిన వారికి వైద్య పరీక్షలు చేయించగా 49 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. అప్పటి నుంచి వీరంతా ఇతర ఖైదీలతో కలిసి ఉంటున్నారు. ఈ కారణంగా ప్రస్తుతం ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 140కు చేరిందని అధికారులు తెలిపారు. అందులో 35 మందికి టీబీ కూడా సోకినట్టు వెల్లడైంది. అదేసమయంలో హెచ్.ఐ.వి. సోకిన రోగులకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నట్టు వారు తెలిపారు. 
 
నిజానికి ఈ జైలులో 1706 మంది ఖైదీలు ఉండాల్సివుండగా, ఈ సంఖ్య 5,500కి చేరుకుంది. ఫలితంగా జైలులో అంటు వ్యాధులతో పాటు రోగ నిరోధక శక్తిని నిర్వీర్యం చేసే వైరస్ సోకినవాళ్లు సరైన చికిత్స తీసుకోకుంటే ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు వెల్లడించారు. హెచ్.ఐ.వి. ముదిరి ఎయిడ్స్‌గా మారుతుందని దీనికి పూర్తి స్థాయిలో చికిత్స లేదని తెలిపారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments