Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫేస్‌బుక్ ప్రియుడి కోసం ఇల్లు వదిలి వెళ్లిన మహిళ... చివరకు శవమై తేలింది...

murder
, ఆదివారం, 13 నవంబరు 2022 (10:00 IST)
ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి కోసం ఓ వివాహిత ఇల్లు వదిలి వెళ్లింది. చివరకు అతని చేతిలోనే ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోహలో జరిగింది. మృతురాలు నిజామాబాద్ వాసి. పెళ్లి చేసుకోమని బలవంతం చేయడంతో ఫేస్‌బుక్ ప్రియుడు ఆమెను కొట్టి చంపేశాడు. ఆ తర్వాత శవాన్ని ఓ కంపెనీ ఆవరణంలో పడేసి ఏమీ తెలియనట్టుగా వెళ్లిపోయాడు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నిజామాబాద్‌కు చెందిన ఉస్మా బేగం (32)కు షెహజాద్‌తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన అతడిని కలిసి ఉస్మా బేగం‌ గజరౌలా చేరుకుంది షెహజాద్‌ను కలిసి ఆమె పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. అందుకు అతడు ససేమిరా అన్నారు. అయినప్పటికీ ఒత్తిడి చేయడంతో ఆమె మెడలో వేసుకున్న దుపట్టాతో కట్టేసి ఇటుక రాయితో తలపైబలంగా కొట్టి చంపేశాడు. ఆ తర్వాత కంపెనీ ఆవరణలోనే ఓ మూలన పడేశాడు. 
 
అయితే, తన భార్య కనిపించడం లేదంటూ ఉస్మాబేగం భర్త ముఖీద్ ఈ నెల 6వ తేదీన బాన్సువాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. ఆమె ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఉస్మాబేగం యూపీలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడకు వెళ్లి చూడగా ఆమ శవమై కనిపించింది.
 
కాగా, ముఖీద్‌కు ఉస్మాబేగంకు 12 యేళ్ల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తతడంత రెండు నెలులుగా ఉస్మాబేగం నిజామాబాద్‌లో ఉంటుంది. ఆ తర్వాత పెద్దలు రాజీ కుదిర్చినప్పటికీ ఆమె మాత్రం తన ఫేస్‌బుక్ ప్రియుడి కోసం యూపీకి వెళ్లి శవమై తేలింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కారు టాప్‌పై పవన్ జర్నీ.. తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు