Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖపట్టణంలో పరువు హత్య.. కుమార్తెను చంపిన తండ్రి!

Advertiesment
murder
, శనివారం, 5 నవంబరు 2022 (09:19 IST)
విశాఖపట్టణంలోని ఒకటో పట్ణణ పోలీస్ స్టేషన్ పరిధిలో పరువు హత్య జరిగింది. ప్రేమించిన యువకుడితో లేచిపోయిన కుమార్తెను కన్నతండ్రి హత్య చేశాడు. ఈ విషయాన్ని ఆయన పోలీసులకు స్వయంగా వెల్లడించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విశాఖ రెల్లి వీధికి చెందిన వరప్రసాద్, హేమలత అనే దంపతులు ఉన్నారు. వీరికి ఇద్దరు కుమర్తెలు. పైగా ఈ దంపతులు చాలాకాలం క్రితం విడిపోయారు. పెద్ద కుమార్తె ప్రేమ వివాహం చేసుకుని భర్తతో ఉంటుంది. రెండో కుమార్తె లిఖిత శ్రీ (15) తండ్రితో కలిసి ఉంటూ పదో తరగతి చదువుకుంటుంది. వరప్రసాద్ మహప్రస్థానం వాహన డ్రైవరుగా పని చేస్తూ కుమార్తెను పెంచుకుంటున్నాడు. 
 
ఈ క్రమంలో లిఖితశ్రీ ఇటీవల తాను ప్రేమించిన యువకుడితో లేచి పోయింది. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇరు కుటుంబాలు రాజీకి వచ్చారు. గురువారం తన కుమార్తెను వరప్రసాద్ ఇంటికి తీసుకెళ్లాడు శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో లిఖితశ్రీ అచేతనస్థితిలో పడివుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
దీంతో అక్కడకు చేరుకున్న వారు కేసు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని వరప్రసాద్‌ వద్ద విచారించగా అసలు విషయం వెల్లడించారు. పెద్ద కుమార్తె ప్రేమించినవాడితో వెళ్లిపోయిందని, రెండో కుమార్తె కూడా ప్రేమ అంటూ దూరం కావడాన్ని భరించలేక ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్వట్టర్‌లో కొనసాగుతున్న తీసివేతల పర్వం... భారత్‌లో 180 మందికి ఉద్వాసన