Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలోని అత్తిబెల్‌లో బాణాసంచా గోదాములో పేలుడు.. 11 మంది మృతి

Webdunia
ఆదివారం, 8 అక్టోబరు 2023 (10:01 IST)
కర్నాటక రాష్ట్రంలోని అత్తిబెల్‌లో ఉన్న ఓ బాణాసంచా గోదాములో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 11 మంది మృత్యువాతపడ్డారు. శివకాశి నుంచి వచ్చిన బాణాసంచా లోడు దించుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి ఈ పేలుడు సంభవించింది. ఆ తర్వాత క్షణాల్లో మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో చిక్కుకున్న షాపు యజమానితో సహా మొత్తం 11 మంది సజీవదహమయ్యారు. శనివారం సాయంత్రం ఈ దారుణ ఘటన జరిగింది. 
 
బెంగుళూరు నగర శివారు ప్రాంతంలో తమిళనాడు సరిహద్దుకు సమీపంలో ఉన్న అనేకల్ తాలూకా అత్తిబెల్‌లో శనివారం ఈ దారుణం జరిగింది. అక్కడి నవీన్ గోదాముకు తమిళనాడుకు శివకాశి నుంచి బాణాసంచా లోడు వచ్చింది. లోడును వాహనం నుంచి దించుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నాలుగు దుకాణాలు, ఒక మినీ కంటైనర్, రెండు పికప్ వాహనాల దగ్ధమైపోయాయి. మంటలు క్షణాల్లో నలు దిక్కులకు వ్యాపించడంతో షాపు యజమానితో సహా మొత్తం 11 మంది మృత్యువాతపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments